News March 25, 2025

క్షయ వ్యాధి నివారణలో మహబూబ్ నగర్ మొదటి స్థానంలో ఉంది

image

క్షయ వ్యాధి నివారణలో చికిత్సను అందించడంలో మహబూబ్ నగర్ మొదటి స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. క్షయ నివారణలో జిల్లా అధికారులు ఎంతో క్రమశిక్షణతో పని చేస్తున్నారని ఈ సందర్భంగా అభినందించారు. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 2,087 మందికి టీబి చికిత్స అందించినట్లు వెల్లడించారు.

Similar News

News March 28, 2025

బాలానగర్ : నర్సింగ్ విద్యార్థి మృతి.. కేసు నమోదు

image

బాలనగర్ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న మండల కేంద్రానికి చెందిన మణిదీప్ మృతి చెందిన సంగతి తెలిసిందే. తన కుమారుడి మరణంపై ఎవరిపైన అనుమానం లేదని, తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం నిమిత్తం యువకుడి మృతదేహాన్ని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై లెనిన్ తెలిపారు.

News March 28, 2025

పాలమూరు: ‘వంద గజాల ప్లాటుకు రూ.3,81,26,542 LRS’

image

MBNR మున్సిపాలిటీ పరిధిలో విచిత్రం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన తిరుపతయ్యకు 100 గజాల స్థలం ఉంది. ఆ ప్లాటుకు రూ.3,81,26,542 LRS చలాన్ వచ్చింది. అవాక్కయిన తిరుపతయ్య వెంటనే మున్సిపల్ అధికారులను సంప్రదించారు. ఇదేంటంటూ వాకబు చేశారు. పొరపాటు జరిగిందంటూ LRSను రూ.12,009కి కుదించారు. అయితే తన పక్కనే ఉన్న 100 గజాల ప్లాట్‌కు రూ.9,380 మాత్రమే వచ్చిందని తిరుపతయ్య తెలిపారు.

News March 28, 2025

MBNR: ఎల్ఆర్ఎస్‌కు గడువు మూడు రోజులే… 51,490 దరఖాస్తులు

image

LRS దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం విధించిన గడువు 3రోజుల్లో ముగియనుంది. కానీ దరఖాస్తులేమో 51,490 పెండింగ్‌లో ఉన్నాయి. దరఖాస్తుల్ని పరిష్కరించుకునే వారికి ప్రభుత్వం 25% రాయితీ ప్రకటించిన దరఖాస్తుదారుల్లో ఏమాత్రం స్పందన కనిపించడంలేదు. వీరికి అవకాశం కల్పిస్తే తమకు ఆదాయం వస్తుందని భావించిన ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది. MBNRలో 29,390, జడ్చర్ల 16,500, భూత్పూర్ 5,600 ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి.

error: Content is protected !!