News September 2, 2025
క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

NTR జిల్లాల్లో రెవెన్యూ సమస్యలు పదేపదే ఎదురవుతుండటంపై కలెక్టర్ లక్ష్మీశా ఎమ్మార్వోలు, ఆర్డీవోల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. PGRSకు వస్తున్న ఫిర్యాదుల్లో 30-40% రెవెన్యూ సమస్యలే ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్, ఇకపై ఎమ్మార్వోలు, ఆర్డీవోలు ఫిర్యాదు దారుల వద్దకే వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News September 2, 2025
సుల్తానాబాద్: ‘భూ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలి’

PDPL కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం సుల్తానాబాద్ తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు అనుమతినిచ్చిన నేపథ్యంలో అర్హుల జాబితా సిద్ధం చేయాలని సూచించారు. భూ భారతి కింద వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, భూ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ బషిరుద్దిన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
News September 2, 2025
అవినీతి సొమ్ము పంచుకోవడంలో విభేదాలు: రాంచందర్ రావు

TG: ‘కాళేశ్వరం’లో అవినీతి జరిగిందని కవిత వ్యాఖ్యలతో స్పష్టమైందని బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్రావు అన్నారు. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాల వల్లే కుటుంబంలో విభేదాలు వచ్చాయని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిని డైవర్షన్ చేసేందుకు కవితను సస్పెండ్ చేశారని ఎంపీ డీకే అరుణ అన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో అధికారంకోసం పంచాయితీ జరుగుతోందన్నారు. BRS, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.
News September 2, 2025
అలంపూర్ ఆలయాలతో వైఎస్సార్కు అనుబంధం

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి అలంపూర్ ఆలయాలతో మంచి అనుబంధం ఉందని స్థానికులు గుర్తు చేసుకున్నారు. 2008లో జరిగిన తుంగభద్ర పుష్కరాల సందర్భంగా అలంపూర్కు వచ్చిన వైఎస్సార్, జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చూపించిన భక్తి, ఈ ప్రాంతంపై ఉన్న అభిమానం ఆయన అభిమానుల గుండెల్లో నిలిచిపోయాయి.