News July 21, 2024

క్షేత్రస్థాయి పర్యటనలు.. ఆకస్మిక తనిఖీలు!

image

క్షేత్రస్థాయి పర్యటనలతో కలెక్టర్ నారాయణరెడ్డి జోరు పెంచారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలు, NLGలోని పలు శాఖల కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని ఏళ్లుగా వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడిన బాలసదనం, సఖి, శిశు గృహాల్లో మౌలిక సదుపాయాలకు గత కలెక్టర్ హరిచందన కృషి చేయగా.. ఆ సంప్రదాయాన్ని ప్రస్తుత కలెక్టర్ కొనసాగిస్తున్నారు.

Similar News

News November 1, 2025

చేప పిల్లల పంపిణీకి ముహూర్తం ఖరారు!

image

జిల్లాలో చేప పిల్లల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. జిల్లాకు 5.98 కోట్ల చేప పిల్లలు కావాలని మత్స్యశాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈనెల రెండో తేదీన నకిరేకల్ పట్టణంలోని పెద్ద చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలో సుమారుగా 60 వేల మంది మత్స్య కార్మికులకు ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా లబ్ధి చేకూరనుంది.

News November 1, 2025

జిఎన్ఎం కోర్సులో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

నల్గొండ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ జనరల్ నర్సింగ్, మిడ్ వైపరీ (జీఎన్ఎం) 3 సంవత్సరాల శిక్షణ కోర్సులో ప్రవేశానికి అర్హత గల పురుష, మహిళా అభ్యర్థుల నుంచి నవంబరు 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా వైద్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు డిఎంహెచ్వో కార్యాలయంలో సంప్రదించాలని ఆయన తెలిపారు.

News November 1, 2025

పెండింగ్ రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్

image

నల్గొండ జిల్లాలలో పెండింగ్‌లో ఉన్న వివిధ రెవెన్యూ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం రెవెన్యూ అంశాలపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న భూ రికార్డులు, భూ భారతి, భూ వివాదాల దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.