News April 7, 2025

ఖమ్మంలో ఏలూరు జిల్లా వాసి మృతి

image

ఖమ్మం పట్టణం నేతాజీనగర్‌లో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. చింతలపూడికి చెందిన రవిప్రసాద్ అనే వ్యక్తి గత 4 నెలలుగా ఓ మహిళతో నేతాజీ నగర్‌లో సహజీవనం చేస్తున్నాడని తెలిసింది. వీరిద్దరి మధ్య రాత్రి వాగ్వాదం జరగడంతో రవిప్రసాద్‌ను సదరు మహిళ గోడకు నెట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 2, 2026

చిన్నారితో రేణూ దేశాయ్.. ఫొటోలు వైరల్

image

న్యూ ఇయర్ సందర్భంగా నటి రేణూ దేశాయ్ ఓ బాబును ఆడిస్తూ తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘పసివాళ్లు దేవదూతల్లా ఉంటారు. ఈ చిన్నారి బాలుడు తన క్యూట్‌నెస్‌తో నా మనసు దోచుకున్నాడు’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఆ పిల్లాడు ఎవరని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ పోస్టుకు ఆమె కామెంట్స్ ఆఫ్ చేయడం గమనార్హం. కాగా ప్రస్తుతం ఆమె ‘పదహారు రోజుల పండగ’ అనే సినిమాలో నటిస్తున్నారు.

News January 2, 2026

పార్లమెంట్‌లో పురందేశ్వరి మార్కు.. 89 శాతం హాజరుతో ఆదర్శప్రాయం!

image

18వ లోక్‌సభలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తనదైన ముద్ర వేశారు. 89శాతం హాజరుతో సభలో చురుగ్గా పాల్గొన్న ఆమె, 16కీలక చర్చల్లో భాగస్వాములయ్యారు. మొత్తం 119ప్రశ్నల ద్వారా కొబ్బరి, పొగాకు రైతుల సమస్యలు, రైల్వేలు, మహిళా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి అంశాలను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లారు. అటు స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తూనే, ఇటు అంతర్జాతీయ వేదికలపై దేశ గొంతుకగా నిలుస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

News January 2, 2026

చిత్తూరు: రూ.350 కోట్ల ఆదాయం.. మారని బతుకులు.!

image

పేరుకే CM సొంత జిల్లా. కుప్పం మినహా మరెక్కడ అభివృద్ధే లేదట. పరిశ్రమలు, మౌలిక వసతులు, రవాణా అంతంత మాత్రమే. నేటికీ తాము విద్య, వైద్యం కోసం తమిళనాడు, TPTకి వెళుతున్నట్లు స్థానికులు అంటున్నారు. జిల్లాలో 960 క్వారీలు ఉన్నాయి. ఏటా రూ.200-250 కోట్ల ఆదాయం వస్తుందట. మున్సిపాలిటీ పన్నులు ఇతర మార్గాల నుంచి వచ్చే రూ.80 కోట్లు అదనం. ఈఆదాయం ఎక్కడికి పోతుంది, జిల్లా అభివృద్ధి ఎందుకు జరగలేదో ఆ మురుగన్‌కే తెలియాలి