News February 22, 2025
ఖమ్మంలో పుష్ప నటుడు జగదీశ్ (కేశవ) సందడి

ఖమ్మంలో శనివారం పుష్ప మూవీ నటుడు జగదీశ్ (కేశవ) సందడి చేశారు. బోనకల్ క్రాస్ రోడ్లో ఓ షాప్ ఓపెనింగ్కు వచ్చిన ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో పలువురు సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. నటుడు జగదీశ్ ‘తగ్గేదేలే’ అంటూ అభిమానులను అలరించారు.
Similar News
News February 23, 2025
విజయానికి స్ఫూర్తి క్రీడలే: ఖమ్మం కలెక్టర్

ఓటమి అంచు వరకు వెళ్లి కూడా పట్టుదలతో ప్రయత్నిస్తే చివరికి విజయం సాధించవచ్చనే స్ఫూర్తి మనకు టెన్నిస్ క్రీడా ఇస్తుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ను శనివారం కలెక్టర్ టాస్ వేసి ప్రారంభించారు. టెన్నిస్ తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు.
News February 23, 2025
ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కఠిన చర్యలు: సీపీ

కామేపల్లి: ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. లింగాల క్రాస్ రోడ్డు చెక్ పోస్ట్ ను పోలీస్ కమిషనర్ శనివారం సందర్శించి తనిఖీ చేశారు. వాగులు, నది పరివాహక ఇసుక తవ్వకాల ప్రాంతాలను గుర్తించి నిఘా పెంచాలని సూచించారు. ఇసుక అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా వెంటనే చట్ట ప్రకారం జరిమానాలు విధించి కేసులు నమోదు చేయాలన్నారు.
News February 22, 2025
తల్లాడ ఘోర రోడ్డు ప్రమాదం.. ఆప్డేట్

తల్లాడ మండలం రంగంబంజరలో<< 15531420>> రోడ్డు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. పెనుబల్లి మండలం ముత్తగూడెంకి చెందిన నాగిరెడ్డి టీవీఎస్పై తల్లాడ మం.నారాయణపురంలో తన అక్కను చూసేందుకు వచ్చాడు. తిరిగి వెళ్తుండగా రంగంబంజర వద్ద వెనక నుంచి కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగిరెడ్డి టైర్ల కిందపడి మృతి చెందాడు. కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SHO వెంకటేశ్వర్లు తెలిపారు.