News February 5, 2025

ఖమ్మంలో రూ.116 కోట్ల ధాన్యం కొనుగోళ్లు: కొత్వాల 

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో DCMS ద్వారా 2024-25 వానాకాలంలో 4.13 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యానికి  రూ.116.49 కోట్లు చెల్లించామని రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్, DCMS ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ధాన్యం కొనుగోలు వివరాలను ఆయన వెల్లడించారు. భద్రాద్రి జిల్లాలో 94 వేల క్వింటాళ్లకు గాను రూ.26.78 కోట్లు, ఖమ్మం జిల్లాలో 3.19 లక్షల క్వింటాళ్లకు గాను సుమారు రూ.90 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు.

Similar News

News November 5, 2025

సిగ్నల్ జంప్ వల్లే రైలు ప్రమాదం!

image

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ రైల్వే స్టేషన్ సమీపంలో <<18197940>>రైలు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. ప్రయాణికుల రైలు బోగీ గూడ్స్ రైలు పైకి ఎక్కడం ప్రమాద తీవ్రతను పెంచింది. ప్యాసింజర్ రైలు రెడ్ సిగ్నల్ జంప్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వేబోర్డు ప్రాథమికంగా అంచనా వేసింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించింది.

News November 5, 2025

కార్తీక పౌర్ణమి ఎందుకు జరుపుతారు?

image

పరమేశ్వరుడి కీర్తిని విని ద్వేషంతో రగిలిపోయిన త్రిపురాసురుడు కైలాసంపైకి దండయాత్రకు వెళ్లాడు. మూడ్రోజుల భీకర పోరాటం తర్వాత ఈశ్వరుడు ఆ అసురుడిని సంహరించాడు. దీంతో వేయి సంవత్సరాల పాటు సాగిన అసుర పాలన అంతమైంది. దేవతల భయం కూడా తొలగిపోయింది. దీంతో అభయంకరుడైన శివుడు ఆనందోత్సాహాలతో తాండవం చేశాడు. ఈ ఘట్టం జరిగింది కార్తీక పౌర్ణమి నాడే కాబట్టి.. ప్రతి సంవత్సరం ఈ శుభదినాన శివుడిని అత్యంత భక్తితో పూజిస్తాము.

News November 5, 2025

ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలుకుతా: రొనాల్డో

image

త్వరలోనే తాను రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు పోర్చుగల్ ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఇది నిజంగానే కష్టంగా ఉంటుంది. నేను కచ్చితంగా ఏడ్చేస్తాను. 25 ఏళ్ల వయసు నుంచే నేను నా ఫ్యూచర్ ప్లాన్ రెడీ చేసుకున్నాను. నాకు వేరే ప్యాషన్స్ ఉన్నాయి. కాబట్టి పెద్దగా బోర్ కొట్టకపోవచ్చు. రిటైర్మెంట్ తర్వాత నా కోసం, నా పిల్లల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాను’ అని తెలిపారు.