News August 6, 2025

ఖమ్మంలో రేపటి నుంచి సదరం క్యాంపులు

image

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 7 నుంచి సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేందర్ తెలిపారు. సదరం క్యాంపులకు దివ్యాంగులు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 7, 12, 14, 19, 21, 23, 26, 28, 30 తేదీల్లో సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్హత కలిగిన దివ్యాంగులు మెడికల్ రిపోర్టులు, పాస్ ఫొటో, స్లాట్ బుకింగ్ స్లిప్‌తో హాజరు కావాలని సూచించారు.

Similar News

News August 7, 2025

ఫోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

image

ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా జడ్జి ఉమాదేవి తీర్పునిచ్చారు. సీఐ సాగర్ వివరాలిలా.. వైరా (M) గొల్లనపాడులో 2024లో లాలయ్య(70) ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో పోక్సో కేసు నమోదు చేశారు. బుధవారం నిందితుడిని కోర్టులో హాజరుపరిచాగా పై విధంగా తీర్పు వచ్చింది.

News August 7, 2025

నేడు కలెక్టరేట్‌లో టెస్కో స్టాల్ ఏర్పాటు

image

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేడు ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో టెస్కో స్టాల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చేనేత డివిజనల్ మార్కెటింగ్ మేనేజర్ బొట్టు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విక్రయాల్లో అన్ని రకాల వస్త్రాలపై 30 శాతం, రాజ్కోట్ ఇక్కత్ సిల్క్ చీరలపై 40 శాతం, ఎంపిక చేసిన వస్త్రాలపై 50 శాతం ప్రత్యేక తగ్గింపు ఉంటుందని తెలిపారు. చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలని ఆయన కోరారు.

News August 6, 2025

క్రూడ్ పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 44%కు పెంచాలి: తుమ్మల

image

క్రూడ్ పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ను కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నిర్మల సీతారామన్‌ను కలిసి పలు సమస్యలను వివరించారు. ఏప్రిల్ నుంచి జులై వరకు ఏర్పడిన లోటు యూరియాను ఈ నెల ఆగస్టు కేటాయింపులతో కలిపి వెంటనే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.