News September 6, 2025

ఖమ్మంలో వేడుకలకు సర్వం సిద్ధం

image

తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు నేడు నిమజ్జనానికి సిద్ధమయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిమజ్జన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖమ్మం నగరంలో మున్నేరు వద్ద, భద్రాచలంలో గోదావరి వద్ద అధికారులు నిమజ్జన ఏర్పాట్లు చేశారు. భద్రత కోసం సీసీ కెమెరాలు, క్రేన్లు, గజఈతగాళ్లతో పాటు భారీగా పోలీసులు మోహరించారు.

Similar News

News September 5, 2025

వేంసూరు: నిమజ్జన ఊరేగింపులో అపశ్రుతి

image

వేంసూరు మండలంలో జరిగిన గణేశ్ నిమజ్జన ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి వి.వెంకటాపురం గ్రామంలో నిమజ్జనానికి వెళ్తుండగా ట్రాక్టర్ పైనుంచి షేక్ రషీద్ (20) అనే యువకుడు కిందపడి మృతి చెందాడు. ట్రాక్టర్ నడుపుతున్న రషీద్ స్నేహితుడికి డ్రైవింగ్ ఇచ్చి పక్కన కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలు కావడంతో చనిపోయాడు.

News September 5, 2025

అధికారులు సమన్వయంతో పని చేయాలి: ఖమ్మం సీపీ

image

గణేశ్ విగ్రహాల నిమజ్జనోత్సవ కార్యక్రమాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. ప్రతి విభాగం సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణకు కఠినమైన పర్యవేక్షణ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. డీజేలకు అనుమతి లేదని, నిర్దేశించిన సమయంలోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలని ప్రత్యేకంగా సూచించారు.

News September 5, 2025

ఖమ్మం: సదరం సర్టిఫికేట్లకు రూ.50 వేలు డిమాండ్..!

image

ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో సదరం క్యాంపుల్లో అవినీతి జరుగుతోందని బాధితుడు ఫిర్యాదు చేశారు. సదరం విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది బయటి వ్యక్తులతో కలిసి దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాలకు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. శాశ్వత ధ్రువీకరణ పత్రానికి రూ.50 వేలు, ఐదేళ్ల సర్టిఫికేట్‌కు రూ.30 వేలు డిమాండ్ చేస్తున్నారని బాధితుడు శ్రీను గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్‌కు ఫిర్యాదు చేశారు.