News December 22, 2025

ఖమ్మంలో ‘శిల్పారామం’

image

ఖమ్మంలో శిల్పారామం ఏర్పాటుకు ముహూర్తం కుదిరింది. ఖానాపురం హవేలీ పరిధిలోని సర్వే నం. 94, 234లో 5.04 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు అధికారులు పరిశీలన పూర్తి చేశారు. శిల్పారామం ముఖద్వారానికి సంబంధించిన నమూనాను తక్షణమే సిద్ధం చేసి, పనులను పట్టాలెక్కించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరం పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా రూపుదిద్దుకోనుంది.

Similar News

News February 5, 2026

ఖమ్మం జనరల్ ఆసుపత్రి వసతులపై కలెక్టర్ సమీక్ష

image

ఖమ్మం జనరల్ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా వసతులు అభివృద్ధి చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి పని తీరు, పెండింగ్ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరుకు సీవరేజ్, టాయిలెట్ పనులు పూర్తి చేయాలని, 7 రోజుల్లో లిఫ్ట్ మరమ్మతులు చేయాలని సూచించారు. ఓపీ సేవల కోసం ముగ్గురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని, మార్చి 15 నాటికి స్టఫ్ పనులు పూర్తి చేయాలన్నారు.

News February 5, 2026

ఖమ్మం RTO కార్యాలయంలో ‘నకిలీ’ దందాపై ఫోకస్

image

ఖమ్మం RTO ఆఫీస్‌లో వెలుగుచూసిన నకిలీ ఆధార్ కార్డుల వ్యవహారంపై విచారణ చేపట్టినట్లు RTO ధర్మపురి జగదీష్ వెల్లడించారు. ఇప్పటికే బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే, ఏళ్లతరబడి పాతుకుపోయిన కొందరు సిబ్బంది అండదండలతోనే ఈ అక్రమాలు సాగుతున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు.

News February 5, 2026

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

image

ఖమ్మం (D)లో క్యాన్సర్ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 1,883 యాక్టివ్ కేసులు ఉండగా, బాధితుల్లో మహిళలే 1,418 మంది ఉన్నారు. ముఖ్యంగా రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. జిల్లాలోని 31 PHC, 7CHCలతో పాటు ప్రభుత్వాసుపత్రిలో రోగులను గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఆహార అలవాట్లు, జీవనశైలిలో మార్పుల ద్వారా ఈ మహమ్మారిని నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.