News August 12, 2025
ఖమ్మం: ఉద్యోగార్థులు, ఉద్యోగులకు వారధిగా DEET

ఖమ్మం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు డా.పి. శ్రీజ, పి.శ్రీనివాస్ రెడ్డి.. డీఈఈటీ యాప్పై సోమవారం అధికారులకు అవగాహన కల్పించారు. నిరుద్యోగులు యాప్ ద్వారా రెస్యూమ్ అప్లోడ్ చేస్తే మార్కెట్ అవసరాలకు అనుగుణమైన అవకాశాలు లభిస్తాయని చెప్పారు. యువతకు యాప్పై అవగాహన కల్పించాలన్నారు. అలాగే రోడ్డు పనుల్లో మిషన్ భగీరథ పైపులు దెబ్బతినకుండా జాయింట్ సర్వే చేయాలని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశించారు.
Similar News
News August 13, 2025
కమనీయం.. రాములోరి నిత్య కళ్యాణం

భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ చేశారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణాన్ని వైభవంగా జరిపారు.
News August 13, 2025
అత్యవసర సమయంలో డయల్-100 కు కాల్ చేయండి: సీపీ

ఖమ్మం జిల్లాలో భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీపీ సునీల్ దత్ సూచించారు. చెరువులు, కుంటల వద్ద నీటి ఉధృతిని దృష్టిలో ఉంచుకొని వంతెనలు, చప్టాలపై బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాల భారీన పడకుండా వాహనాల రాకపోకలను నిషేధించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కు, స్థానిక పోలీసులకు, పోలీస్ కంట్రోల్ సెల్ నెంబర్ 8712659111 సమాచారం ఆందిచాలని పేర్కొన్నారు.
News August 13, 2025
KMM: ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి నిరాకరణ.. సూసైడ్

పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెనుబల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. గంగదేవిపాడుకి చెందిన దంతనపల్లి నాగరాజు(24) ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు తన తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై ఎస్సై వెంకటేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.