News August 21, 2025
ఖమ్మం: ఐబీ శాఖలో DEEలు, EEలకు అదనపు బాధ్యతలు

ఖమ్మం జిల్లా జల వనరుల శాఖలో ఖాళీగా ఉన్న స్థానాల్లో డీఈఈలు, ఈఈలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమలాయపాలెం డీఈఈ రమేశ్రెడ్డికి పాలేరు ఈఈగా, ఖమ్మం సీఈ కార్యాలయంలో డీఈ కె.శోభారాణికి అదే కార్యాలయంలో డీసీఈగా, సత్తుపల్లి ఈఈ ఎస్.శ్రీనివాస్రెడ్డికి కల్లూరు డీఎస్ఈగా, మధిర డీఈఈ రాంప్రసాద్కు మధిర ఈఈగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Similar News
News August 21, 2025
ఖమ్మం: ఈ ప్రాంతాల్లోనే వర్షపాతం నమోదు

జిల్లాలో బుధవారం ఉదయం 8:30 నుంచి గురువారం ఉదయం 8:30 వరకు 8.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఖమ్మం రూరల్ 3.4, కామేపల్లి, చింతకాని, వైరా 1.2, ఏన్కూరు 1.0, నేలకొండపల్లి మండలంలో 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. అటు ఇతర మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.
News August 21, 2025
ఖమ్మం: ఉపాధ్యాయుల పదోన్నతులకు లైన్ క్లియర్

ఖమ్మం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పిం చేలా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు గురువారం ఉదయం వరకు సీనియారిటీ జాబితాలో ఉన్న ఎస్ఏలు వెన్ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించింది. జోనల్ స్థాయిలో 1,300 మందికి అవకాశముండగా, ఖమ్మం జిల్లాలో 70 మంది హెచ్ఎంలుగా పదోన్నతి పొందనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎస్ఓటీలకు ఎస్ఏలుగా పదోన్నతి కల్పించనున్నారు.
News August 21, 2025
ఖమ్మం: మీనం.. ఇక అంతా సిద్ధం.!

ఖమ్మం జిల్లాలో చేప పిల్లల పంపిణీకి అంతా సిద్ధమైంది. సెప్టెంబర్ ఒకటో తేదీన సరఫరాదారుల నుంచి వచ్చిన టెండర్లు పరిశీలించి, వారి అర్హతలను బట్టి ఖరారు చేయనున్నారు. ఖమ్మం జిల్లాలో రిజర్వాయర్లు, కుంటలు కలిపి 882 ఉండగా, వీటికి 3.49 కోట్ల ఉచిత చేప పిల్లలను సరఫరా చేస్తారు. మూడు నెలలు ఆలస్యమైనా ప్రభుత్వం తమను గుర్తించి ఉచిత చేప పిల్లల సరఫరాకు టెండర్లు విడుదల చేయడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.