News April 19, 2025
ఖమ్మం కంచుకోటలో.. ఎర్ర జెండా పార్టీలు పుంజుకునేనా?

దేశంలో కమ్యూనిస్టులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అడ్డాగా ఉండేది. జిల్లాను CPI, CPM, CPIML మాస్ లైన్, CPIML న్యూ డెమోక్రసీ నేతలు ఏకఛత్రాధిపత్యంతో ఏలారు. అలాంటి ప్రాంతాల్లో నేడు ఆ పార్టీల ఉనికి తగ్గుతోంది. నాడు ప్రజాసమస్యలపై కదిలిన ఎర్ర దండు.. నేడు ఆ స్థాయిలో ప్రభావం చూపడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. అలాగే కమ్యూనిస్టుల మధ్య సమన్వయం లోపించిందని అంటున్నారు. మళ్లీ ఆ పార్టీలు పుంజుకునేనా.. కామెంట్ చేయండి.?
Similar News
News April 19, 2025
ఈ అలవాట్లతో మీ లివర్ రిస్క్లో పడ్డట్లే..

చక్కెర అధికంగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల అది కొవ్వుగా మారి ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రై ఫుడ్స్ కాలేయంపై భారాన్ని పెంచుతాయి. మాంసం అధికంగా తినడం వల్ల శరీరంలో అమ్మోనియా స్థాయులు పెరుగుతాయి. పెయిన్ కిల్లర్స్, వెయిట్ లాస్ మెడిసిన్స్ వల్ల కాలేయంపై ప్రభావం పడే అవకాశముంది. లివర్ చెడిపోవడానికి ఆల్కహాల్ ప్రధాన కారణమని, కనుక ఈ అలవాటును పూర్తిగా మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News April 19, 2025
NGKL: ధరణితో నరకం: మంత్రి జూపల్లి

గత BRS ప్రభుత్వ పాలనలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా రైతులు నరకం అనుభవించారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. భూభారతి చట్టంపై గగ్గలపల్లిలో నిర్వహించిన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి జూపల్లి కృష్ణారావు పాల్గొని మాట్లాడారు. రైతుల పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి వారి సమస్యల పరిష్కారానికి తీసుకువచ్చిన భూభారతి చట్టం 100 ఏళ్ల వరకు భూ సమస్యలు తలెత్తకుండా ఉపయోగపడుతుందన్నారు.
News April 19, 2025
HYD: రివాల్యుయేషన్కు దరఖాస్తుల ఆహ్వానం

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంసీఏ మెయిన్, బ్యాక్ లాగ్ పరీక్షలతో పాటు దూరవిద్య ఎంసీఏ పరీక్ష రివాల్యుయేషన్కు ఒక్కో పేపర్కు రూ.800 చొప్పున చెల్లించి ఈ నెల 23వ తేదీలోగా టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రూ.200 అపరాధ రుసుముతో ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.