News March 27, 2024

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బరిలో నిలిచేది ఎవరు..?

image

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రకటనపై నేడు ఉత్కంఠకు తెరపడనుంది. ఈరోజు రాత్రి ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ పార్టీ సీఈసీ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని అధిష్ఠానం ఖరారు చేసి ప్రకటన చేయనుంది. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేసులో ప్రధానంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి, నందిని విక్రమార్క ఉన్నారు. వీరిలో ఒకరిని అధిష్ఠానం ఖరారు చేయనుంది. కాగా వీరిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఎవరు ఉంటారో కామెంట్ చేయండి.

Similar News

News February 15, 2026

ఖమ్మం: ప్రతి ఇంటికీ తపాలా ఖాతా.. కీలక ఆదేశాలు

image

ఖమ్మం: తపాలా శాఖ పొదుపు పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా తపాలా సూపరింటెండెంట్ వీరభద్ర స్వామి సిబ్బందిని ఆదేశించారు. ప్రతి ఇంటికీ ఒక పొదుపు ఖాతా ఉండేలా చూడాలని, ముఖ్యంగా ఆడపిల్లల కోసం ‘సుకన్య సమృద్ధి’ పథకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. సర్పంచుల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో బీమా, డిపాజిట్లపై అవగాహన కల్పించి తపాలా సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు.

News February 15, 2026

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా 3 రోజులు సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఆదివారం వారాంతపు సెలవుతో పాటు, సోమవారం (16-02-2026) మహాశివరాత్రి, మంగళవారం అమావాస్య సందర్భంగా మార్కెట్ లావాదేవీలు నిలిపివేయనున్నారు. తిరిగి బుధవారం నుంచి మార్కెట్ యథావిధిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి, క్రయవిక్రయాల కోసం బుధవారం మార్కెట్‌కు రావాలని అధికారులు కోరారు.

News February 14, 2026

పాలేరు చెరువులోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి దుర్మరణం

image

ఖమ్మం జిల్లా పాలేరు చెరువులో ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ఓ కారు వేగంగా చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తి నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుడు APకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. స్థానిక జాలర్ల సాయంతో కారును బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.