News January 31, 2026

ఖమ్మం కార్పొరేషన్‌లో అవినీతి కంపు !

image

ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది చేస్తున్న అవినీతి వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది. శానిటేషన్ సెక్షన్ అధికారి తన కింద పని చేస్తున్న జవాన్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని, డబ్బులివ్వని వాళ్ల డివిజన్లు మారుస్తామని బెదిరిస్తున్నారు. మహిళా సిబ్బంది పట్ల ఆయన ప్రవర్తనపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఐఏఎస్ అధికారి కమిషనర్‌గా ఉన్న KMCలో ఈ పరిస్థితిపై చర్చ జరుగుతోంది.

Similar News

News February 11, 2026

13న ఆర్టీఏ సేవలకు అంతరాయం: డీటీఓ జగదీష్

image

హైదరాబాద్‌లో నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమం కారణంగా ఈనెల 13న జిల్లాలో వాహన రవాణా శాఖ సేవలకు అంతరాయం కలగనుంది. వైరా కార్యాలయ సిబ్బంది శిక్షణకు హాజరవుతుండటంతో అక్కడ సేవలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు జిల్లా రవాణా అధికారి (DTO) ధర్మపురి జగదీష్ తెలిపారు. ఖమ్మం, సత్తుపల్లి కార్యాలయాల్లో సేవలు పాక్షికంగానే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు, ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.

News February 11, 2026

ఖమ్మం జిల్లాలో తొలి రెండు గంటల్లో 15.37% ఓటింగ్

image

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్ ఉత్సాహంగా ప్రారంభమైంది. తొలి రెండు గంటల్లో (ఉదయం 9 గంటల వరకు) సగటున 14.44 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా కల్లూరులో 19.80%, కనిష్ఠంగా మధిరలో 12.72% పోలింగ్ జరిగింది. ఏదులాపురంలో 15.65%, వైరాలో 14.52%, సత్తుపల్లిలో 15.12% ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.

News February 11, 2026

ఖమ్మం: పుర ఎన్నికలు…1,100 మందితో బందోబస్తు

image

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పుర ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ఎన్నికలకు 1,100మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో నలుగురు ఆడిషనల్ డీసీపీలు, ఎనిమిది మంది ఏసీపీలు, 25 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 975 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించాలని సీపీ సూచించారు.