News June 24, 2024

ఖమ్మం కార్పొరేషన్ నూతన కమిషనర్‌గా అభిషేక్ అగస్త్య

image

ఖమ్మం కార్పొరేషన్ నూతన కమిషనర్ గా అభిషేక్ అగస్త్య(IAS)ను నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 సివిల్స్ బ్యాచ్‌‌‌కు చెందిన అభిషేక్ అగస్త్య 38 ర్యాంకుతో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అభిషేక్ అగస్త్య స్వస్థలం జమ్మూకశ్మీర్. ప్రస్తుతం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అడిషనల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూ బదిలీపై ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ గా రానున్నారు.

Similar News

News October 7, 2024

సత్తుపల్లి: పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య

image

సత్తుపల్లి మండలం<<14289034>> రేగళ్లపాడుకి చెందిన సైద్‌పాషా సూసైడ్ <<>>చేసుకున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. పాషా స్నేహితుడు ఖాసుబాబు వారం కిందట పాషా సెల్‌ఫోన్ నుంచి ఓ వివాహితకు కాల్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. ఆ వివాహిత తన భర్తకి ఈ విషయం తెలియడంతో పాషా షాప్ దగ్గరకు వచ్చి అతడిపై దాడి చేశాడు. తాను చేయని తప్పుకు శిక్ష అనుభవించానని అవమానంగా భావించిన పాషా సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 7, 2024

న్యూజిలాండ్‌లో కొత్తగూడెం యువతికి మొదటి బహుమతి

image

న్యూజిలాండ్‌ ఆక్లాండ్‌లోని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో బతుకమ్మ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో కొత్తగూడెం త్రీ ఇంక్లైన్ కార్మిక ప్రాంతానికి చెందిన చంద్రగిరి రేఖ పేర్చిన బతుకమ్మకి మొదటి బహుమతి లభించింది. న్యూజిలాండ్‌లో స్థిరపడిన తెలంగాణ చెందిన మహిళ కుటుంబాలలు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు.

News October 7, 2024

విద్యుత్ షాక్‌తో బాలిక మృతి

image

గుండాల మండలంలో విద్యుత్ షాక్‌తో బాలిక మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. వెన్నెలబైలు గ్రామానికి చెందిన కృష్ణారావు, సుమలత దంపతుల కుమార్తె సువర్ణ (12). ఆదివారం సాయంత్రం ఇంట్లో కరెంట్ వైరు తెగి ఐరన్ తలుపులపై పడింది. అది గమనించని సువర్ణ ఇంట్లోకి వెళుతూ తలుపులను తాకింది. దీంతో షాక్‌కు గురై మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.