News April 4, 2025

ఖమ్మం ఖిల్లా రోప్ వే ప్రాజెక్టుకు రూ.29 కోట్లు

image

ఖమ్మం నగరంలోని ఖిల్లాపై రోప్ వే ప్రాజెక్టుకు జిల్లా యంత్రాంగం రూ.29 కోట్లు మంజూరు చేసింది. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగం ఖర్చుల అంచనాలను సిద్ధం చేసింది. ఇందులో ఖిల్లాపై రోప్ వే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఖిల్లా మెట్ల మార్గం కుడి వైపున రెండు అంతస్తుల బేస్ స్టేషను ఏర్పాటు చేయడంతో పాటు రోప్ వేలో 200-250 మంది బరువును తట్టుకునే సామర్థ్యమున్న 275 మీటర్ల తీగలను ఏర్పాటు చేయనున్నారు.

Similar News

News January 23, 2026

కల్లూరు: గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రమాదం.. ఆప్డేట్

image

కల్లూరు మండలంలోని లింగాల సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై శుక్రవారం <<18932335>>రోడ్డు <<>>ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఎస్ఐ హరిత వివరాల ప్రకారం.. ఏపీలోని చింతలపూడి మండలానికి చెందిన గట్టు రాంబాబు, కొమ్ము సాయి బైక్‌పై వెళ్తూ అదుపుతప్పి హైవే రైలింగ్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News January 23, 2026

కల్లూరు: గ్రీన్ ఫీల్డ్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి

image

కల్లూరు మండలం లింగాల గ్రామ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఇంకా ప్రారంభం కాని ఈ రహదారిపై బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

News January 23, 2026

ఖమ్మంలింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు: డీఎంహెచ్‌ఓ

image

జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే స్కానింగ్ సెంటర్లను సీజ్ చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రామారావు హెచ్చరించారు. శుక్రవారం పీసీపీఎన్డీటీ చట్టం అమలుపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. చట్టవిరుద్ధంగా పరీక్షలు చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లాలో స్కానింగ్ సెంటర్ల నమోదు, రెన్యూవల్ కోసం వచ్చిన 24 దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.