News April 24, 2024
ఖమ్మం: గుండెపోటుతో అడ్వకేట్ మృతి

పెనుబల్లి మండలం వియం బంజర గ్రామానికి చెందిన అడ్వకేట్ పీవీ భాస్కర్ గుండెపోటుతో మృతి చెందారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సప్తపది వారు మృతుడి నేత్రాలను సేకరించి నేత్రదాన నిధికి పంపించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా ఛైర్మన్ అబ్దుల్ సలాం, కార్యదర్శి సుంకర సత్యనారాయణ, అధ్యక్షుడు కోట్లు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Similar News
News April 22, 2025
ఖమ్మం జిల్లా ఇంటర్ రిజల్ట్స్

ఇంటర్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్లో 16919 మంది పరీక్షలు రాయగా 12996 మంది పాసయ్యారు. 76.81 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది. ఫస్ట్ ఇయర్లో 17837 మందికి 12476 మంది పాసయ్యారు. పాస్ పర్సంటేజీ 69.94 శాతం.
News April 22, 2025
ఖమ్మం జిల్లా జైలులో పనికిరాని ఇనుప సామగ్రి వేలం

పనికిరాని ఇనుప సామగ్రిని ప్రజల సమక్షంలో బహిరంగ వేలం వేస్తున్నట్టు ఖమ్మం జిల్లా జైలు సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. జైలులోని ఫ్యాక్టరీ స్క్రాప్ను ఈనెల 25న వేలం నిర్వహిస్తున్నామని, ఆసక్తిగలవారు రూ.5వేలు కనీస ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొనాలని కోరారు. మరింత సమాచారం కొరకు జిల్లా జైలర్లు సక్రునాయక్ (94946 32552), లక్ష్మీ నారాయణ(97005 05151)ను సంప్రదించాలని తెలిపారు.
News April 22, 2025
జిల్లాలో ముమ్మరంగా ధాన్యం కనుగొళ్లు

ఖమ్మం జిల్లాలో యాసంగి ధాన్యం కనుగొళ్లు ముమ్మరంగా సాగుతున్నట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి చందన్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 385 రైతులకు రూ.1.45 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు. 29,056 క్వింటాళ్ల సన్నధాన్యానికి బోనస్ చెల్లించామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మకాలు జరిపి మద్దతు ధర, బోనస్ పోందాలని ఆయన కోరారు.