News May 20, 2024

ఖమ్మం: గెలుపు ధీమాలో కాంగ్రెస్..!

image

నల్గొండ – ఖమ్మం – వరంగల్‌ ‌పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుస్తామని కాంగ్రెస్ ధీమాతో ఉంది. గతంలో ఈ స్థానం నుంచి గెలవకపోవడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మల్లన్న గెలుపు కోసం శ్రమిస్తున్నారు. తద్వారా గెలుపు ఈజీ అవుతుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.

Similar News

News July 5, 2025

అత్యధికంగా ఖమ్మం రూరల్.. అత్యల్పంగా మధిర

image

ఖమ్మం జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గతేడాది కంటే పెరిగింది. గతేడాది 66,288 మంది ఉండగా, ఈ ఏడాది 68,175కు చేరింది. 1,887 మంది విద్యార్థులు పెరిగారు. అత్యధికంగా KMM (R) 359 మంది, అతి తక్కువగా మధిరలో ఆరుగురు పెరిగారు. కూసుమంచి 318, KMM (U)18, SPL 167, పెనుబల్లి 121, సింగరేణి 158, బోనకల్‌ 104, కల్లూరు 105, ఎర్రుపాలెం 91, ఏన్కూరు 75, ముదిగొండ 63, తల్లాడ 15, కామేపల్లిలో 11 మంది పెరిగారు.

News July 5, 2025

ఖమ్మం జిల్లాలో ముగిసిన కళాశాలల బంద్

image

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లాలో ఈనెల 3, 4న PDSU తలపెట్టిన 48 గంటల కళాశాలల బంద్‌ శుక్రవారం నాటికి ముగిసింది. బంద్ సందర్భంగా ఖమ్మం కాకతీయ యూనివర్సిటీ పీజీ కళాశాల ముందు PDSU నేతలు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా విద్యార్థుల సమస్యలు మాత్రం తీరడం లేదని దుయ్యబట్టారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

News July 4, 2025

వరద విపత్తుల నిర్వహణకు సిద్ధం: ఖమ్మం కలెక్టర్

image

వరద విపత్తుల నిర్వహణకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, సంబంధిత అధికారులతో కలిసి శుక్రవారం జిల్లా విపత్తుల నిర్వహణపై సమావేశమయ్యారు. గత సంవత్సరం వచ్చిన భారీ వరదలు, విపత్తుల నిర్వహణ కోసం జిల్లాలో చేసిన ఏర్పాట్లు, ప్రణాళిక తదితర అంశాలను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.