News September 23, 2025
ఖమ్మం: ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

నేలకొండపల్లి మండలంలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతనగర్ గ్రామం సమీపంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Similar News
News September 23, 2025
బాణసంచా దుకాణాలకు దరఖాస్తు చేసుకోండి: సీపీ

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునే వ్యాపారులు అనుమతి పొందాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 01 సాయంత్రం లోపు ఆయా డివిజన్ల పరిధిలోని ఏసీపీ కార్యాలయాల్లో సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు తప్పకుండా పాటించాలని, దరఖాస్తుతో పాటు సెల్ఫ్ అఫిడవిట్, ఆధార్ కార్డు, ఫోటో, చలానా జత చేయాలని పేర్కొన్నారు.
News September 23, 2025
పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

ఖమ్మం జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో పబ్లిసిటీ అసిస్టెంట్ (వీడియో కెమెరామెన్) పోస్టును ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏదైనా డిగ్రీ అర్హత గల అభ్యర్థుల నుంచి ఈనెల 25లోగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. AP/TG స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్&ట్రైనింగ్ ద్వారా జారీ చేసిన సినీ ఫోటోగ్రఫీ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
News September 23, 2025
ఆకేరు వాగులో రైతు గల్లంతు

తిరుమలాయపాలెం మండలంలోని పడమటి తండాకు చెందిన గుగులోతు రాములు (58) ఆకేరు వాగులో గల్లంతయ్యాడు. సోమవారం రాత్రి తన పొలంలో పని ముగించుకుని తిరిగి వస్తుండగా, ప్రమాదవశాత్తు వాగులో కాలు జారి పడి కొట్టుకుపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.