News June 30, 2024

ఖమ్మం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు: తుమ్మల

image

హైదరాబాద్ తరహాలో ఖమ్మం అభివృద్ధి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు రూ.655 కోట్లతో ఈ ఏడాది 6 రోడ్లు మంజూరు చేశామన్నారు. ఖమ్మం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. గతంలో R&B మంత్రిగా ఉన్నప్పుడు ఈ రహదారుల గురించి ప్రతిపాదన చేశానన్నారు. కొత్తగూడెం పాల్వంచ బైపాస్, మిస్సింగ్ లింక్ కలపడానికి 6km రోడ్డు రూ.125 కోట్లకు ఆమోదముద్ర పడిందన్నారు.

Similar News

News July 8, 2024

గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

భద్రాచలంలో గల్లంతైన హైదరాబాద్‌కు చెందిన హరీష్ (28) మృతదేహం లభ్యమైంది. ఆదివారం రాత్రి వరకు వెతికిన ఆచూకీ దొరకలేదు. ఈరోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

News July 8, 2024

ఆదాయం దండిగా వస్తున్నా.. ఇంకా అద్దె భవనాల్లోనే!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వానికి ప్రతినెల పెద్ద మొత్తంలో ఆదాయం అందించే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాలు సొంత స్థలాలు ఉన్నా ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో సొంత భవనాలు సమకూరుతాయని, ఈ శాఖపై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

News July 8, 2024

ఖమ్మం మార్కెట్‌లో పెరిగిన మిర్చి ధర

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,550 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,300 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.2050 పెరగగా, పత్తి ధర మాత్రం రూ.50 తగ్గినట్లు వ్యాపారస్థులు తెలిపారు.