News March 15, 2025

“ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు..!!

image

✓:మంత్రి ఉత్తమ మంత్రి తుమ్మల భేటీ✓:ఖమ్మం జిల్లాలో ఘనంగా హోలీ వేడుకలు ✓:ఖమ్మం:KCRపై సీఎం వ్యాఖ్యలు సరికాదు: MP రవిచంద్ర ✓:సత్తుపల్లి: ఆయిల్ పామ్ గెలల అపహరణ ✓:నేలకొండపల్లి:రుణాలు చెల్లించలేదని పొలాల్లో జెండాలు పాతారు! ✓:ఖమ్మం:కరుణగిరి వద్ద భారీ కొండచిలువ ప్రత్యక్షం ✓:మధిర:పేరెంట్స్,భర్త సహకారంతో లెక్చరర్ గా ✓:ఎర్రుపాలెం: అప్పులు బాధ తాళలేక రైతు ఆత్మహత్య

Similar News

News March 15, 2025

మంత్రి ఉత్తమ్‌తో మంత్రి తుమ్మల భేటీ

image

రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. సత్తుపల్లి ట్రంక్, సీతారామ ప్రాజెక్ట్ పురోగతి, భూసేకరణ, ఖర్చు, నాణ్యత, భవిష్యత్ ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం సత్తుపల్లి ట్రంక్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మిగిలిన పనుల పురోగతిని సమీక్షిస్తూ ప్రాజెక్ట్ నాణ్యత, ఖర్చుల సమీక్ష, పనివేగంపై తుమ్మల విశ్లేషించారు.

News March 15, 2025

మెగాస్టార్ చిరంజీవికి అవార్డు హర్షం వ్యక్తం చేసిన ఎంపీ

image

మెగాస్టార్ చిరంజీవికి యునైటెడ్ కింగ్డమ్ ప్రతిష్ఠాత్మక “లైఫ్ టైం అచీవ్ మెంట్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్”పురస్కారాన్ని ప్రకటించడం పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తంచేశారు. సినిమా హీరోగా లక్షలాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొని మెగాస్టార్ గా కీర్తించబడుతున్న చిరంజీవి బ్లడ్,ఐ బ్యాంకులు నెలకొల్పి విశేష సేవలందిస్తున్నారని ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.

News March 14, 2025

ఖమ్మం: రుణాలు చెల్లించలేదని జెండాలు పాతారు!

image

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పంట రుణాలు చెల్లించలేదని రైతులు పొలాల వద్ద బ్యాంక్ అధికారులు జెండాలు పాతారు. నేలకొండపల్లి మండలంలోని కోనాయిగూడెం, అరేగూడెం గ్రామాల్లో రైతులు బ్యాంకులో తీసుకున్న రుణాలు చెల్లించలేదంటూ అధికారులు గురువారం ఎర్రజెండాలు పాతారు. నేలకొండపల్లి డీసీసీబీ బ్రాంచ్ పరిధిలో దాదాపు 20 మంది రైతులు సుమారు రూ.2 కోట్ల మేర బకాయిలు తీసుకొని స్పందించకపోవడంతో జెండాలు పాతినట్లు చెప్పారు.

error: Content is protected !!