News February 25, 2025
ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

✓ గుడ్ న్యూస్…రేపు ఖమ్మంలో జాబ్ మేళా✓ ఏన్కూరు: వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు✓ మధిర:డిప్యూటీ సీఎం పీఏ శ్రీనివాస్ గుండెపోటుతో మృతి✓ఖమ్మం నారాయణ కాలేజ్ వద్ద పీడీఎస్యూ ఆందోళన✓ కల్లూరు: తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు✓ ఖమ్మం: మత సామరస్యానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి: సీపీ✓ఖమ్మం: ప్రజావాణిలో వినతులు స్వీకరించిన కేఎంసీ కమిషనర్✓ స్టూడెంట్గా మారిన ఖమ్మం జిల్లా కలెక్టర్
Similar News
News February 25, 2025
తీర్థాల జాతరకు వచ్చే భక్తులకు ఖమ్మం కమిషనర్ సూచనలు

> ఖమ్మం పట్టణం వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు దానవాయిగూడెం, రామన్నపేట, కామంచికల్ మీదుగా వచ్చి కామంచికల్ మున్నేరు వాగు బ్రిడ్జ్ రోడ్డుకి ఇరువైపులా పార్కింగ్ చేయాలి.> ఇక ట్రాక్టర్లు, లారీలు కామంచికల్, పటివారిగూడెం నుంచి జాన్బాద్ తండా వెళ్లే దారిలోని కామంచికల్ బ్రిడ్జి దగ్గర పార్కింగ్ చేయాలి.
News February 25, 2025
సత్తుపల్లిలో GOVT స్కూల్ ఫ్లెక్సీ అదుర్స్

మనం చాలా చోట్ల కార్పొరేట్ స్కూళ్లకు చెందిన ఫ్లెక్సీలు, నేమ్ బోర్డులు చూస్తుంటాం.. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారంటూ ఉపాధ్యాయులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చదువులో రాణించడంతోపాటు ఏ పోటీల్లో పాల్గొన్నా బహుమతి కచ్చితమంటూ ఫ్లెక్సీ ద్వారా ఆ టీచర్లు ప్రచారం చేస్తున్నారు.
News February 25, 2025
ఖమ్మం: సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెనుబల్లి మండలం టేకులపల్లిలో సోమవారం రైతులతో సమావేశమై సాగు నీటి విడుదల షెడ్యూల్పై ముందుగా సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. టెయిల్ ఎండ్ ప్రాంతాలకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రామంలో తాగునీటి సరఫరా, విద్య, వైద్యం అంశాలను పరిశీలించారు. అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.