News December 27, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} మధిరలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
∆} సత్తుపల్లిలో మంత్రి తుమ్మల పర్యటన
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} పాలేరులో మంత్రి పొంగులేటి పర్యటన
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

Similar News

News December 30, 2025

GOOD NEWS చెప్పిన ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి వచ్చేవరకు పాత పద్ధతిలోనే ఎరువుల సరఫరా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలను పరిశీలించి, వారు సాగు చేస్తున్న పంట విస్తీర్ణానికి అనుగుణంగా యూరియా కేటాయించాలని అధికారులను ఆదేశించారు. అన్ని కేంద్రాల్లో ఉదయం 6 గంటల నుంచే పంపిణీ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఎరువుల నిల్వలపై రైతులు ఆందోళన చెందవద్దన్నారు.

News December 30, 2025

ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలపై బ్యాంకర్లు దృష్టి సారించాలి: అ. కలెక్టర్

image

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల విజయవంతానికి బ్యాంకర్లు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో మాట్లాడారు. రెండో త్రైమాసికం ముగిసే నాటికి జిల్లాలో ప్రాధాన్యత రంగం కింద నిర్దేశించుకున్న రుణ పంపిణీ లక్ష్యంలో 54.15 శాతం పూర్తి చేసినట్లు వెల్లడించారు. మిగిలిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కోరారు.

News December 30, 2025

ఖమ్మం: తగ్గిన నేరాలు.. బాధితులకు రూ.7 కోట్లు వాపస్!

image

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు భారీగా తగ్గాయని సీపీ సునీల్ దత్ తెలిపారు. పోలీసుల సమష్టి కృషితో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు కట్టడి అయ్యాయన్నారు. ఇప్పటివరకు రూ.2.45 కోట్ల చోరీ సొత్తును రికవరీ చేశామన్నారు. సైబర్ నేరగాళ్లు దోచుకున్న రూ.4.5 కోట్లను బాధితుల ఖాతాల్లో జమ చేయించామని, మరో రూ.1.5 కోట్లు హోల్డ్ చేశామని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా 36,709 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు.