News February 20, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} కొనిజర్ల మండలంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
Similar News
News March 2, 2026
ఖమ్మం: బాలికలకు ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సిన్

గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14-15 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఖమ్మం జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. మార్చి 4న జీజీహెచ్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లాలో 14 వేల మంది బాలికలను గుర్తించి, 7 ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేయనున్నారు. మార్కెట్లో రూ.3,500 విలువ చేసే ఈ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.
News March 2, 2026
ఖమ్మం: రైతు భరోసా కోసం ఎదురుచూపులు

రైతు భరోసా పథకం అమలు కోసం ప్రభుత్వం నిధుల విడుదలకు పచ్చజెండా ఊపినట్లు ప్రకటనలు వచ్చినా, క్షేత్రస్థాయిలో జాప్యం జరుగుతోంది. ఏటా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్న హామీ ప్రకటనలకే పరిమితమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధుల కొరతతో పెట్టుబడి సాయం అందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.
News March 2, 2026
ఖమ్మం: నిర్లక్ష్యం వీడకుంటే ఉద్వాసనే

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఉపాధ్యాయులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత మూడు నెలల్లో 70 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా, ఎనిమిది మందిని సస్పెండ్ చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిని టర్మినేట్ చేశారు.(ECR) అమలు, ఎఫ్ఆర్ఎస్ హాజరుపై కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక నిఘా పెట్టారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా వదిలేది లేదని డీఈఓ చైతన్య జైనీ హెచ్చరించారు.


