News March 31, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆}ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} పెనుబల్లి నీలాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన
Similar News
News April 2, 2025
ఖమ్మం: విద్యార్థుల ముసుగులో BRS అరాచకం: మంత్రి

HCU భూ అంశంపై విద్యార్థుల ముసుగులో BRS అరాచకం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. జంతువులు చనిపోయినట్లు సోషల్ మీడియాలో చూపుతున్న ఫోటోలు పాతవని స్పష్టం చేశారు. అక్కడి బండరాళ్లు, చెరువులకు ఎలాంటి నష్టం జరగనివ్వమని స్పష్టం చేశారు. ఈ భూముల్లోని జంతువులు, పక్షులకు ఎలాంటి హాని జరగలేదని మంత్రి పొంగులేటి చెప్పారు.
News April 2, 2025
ఖమ్మం: కేంద్రమంత్రితో రాజ్యసభ ఎంపీలు భేటీ

రాజ్యసభ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి మంగళవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రాంమోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. పార్లమెంట్ ప్రాంగణంలోని మంత్రి ఛాంబర్లో ఆయనతో సమావేశమై తెలంగాణలో విమానశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. భద్రాద్రి కొత్తగూడెంలో విమానశ్రయం ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కోరారు. సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చేపోయే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.
News April 2, 2025
ఖమ్మం: పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్

అర్హులైన యువత రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ తెలిపారు. మంగళవారం మధిర మండలం దెందుకూరు గ్రామంలో రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల ప్రక్రియను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత దరఖాస్తు దారులతో అదనపు కలెక్టర్ ఇంటరాక్ట్ అయ్యారు.