News April 17, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} కల్లూరులో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ ∆} నేలకొండపల్లిలో భూభారతిపై అవగాహన కార్యక్రమం ∆} పెనుబల్లి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మంలో జాబ్ మేళా ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} వివిధ శాఖల అధికారులతో ఇన్ఛార్జ్ కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
Similar News
News April 19, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓:రఘునాథపాలెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ✓: కూసుమంచిలో భూభారతిపై అవగాహన కార్యక్రమం ✓: తల్లాడలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ✓:ఏన్కూర్: వ్యవసాయ మార్కెట్కు సెలవు ✓:జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ✓: కారేపల్లిలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ✓: పలు శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం ✓: ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
News April 19, 2025
NKP: భూ భారతి చట్టంతో భూ సమస్యలు వేగంగా పరిష్కారం

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని, గ్రామాల్లో చేపడుతున్న రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలని ఇంచార్జ్ కలెక్టర్ డా. పి. శ్రీజ తెలిపారు. నేలకొండపల్లి మండలం చెరువు మాధారం, కొత్త కొత్తూరు గ్రామాలలో చేపట్టిన రెవెన్యూ సదస్సులను ఇంచార్జ్ కలెక్టర్ తనిఖీలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు ఉన్నారు.
News April 19, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలను సహించం: మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకంలో అవకతవకలకు పాల్పడే ఎలాంటి వారినైనా ఉపేక్షించమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల విషయంలో అక్రమాలకు పాల్పడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బేస్మెంట్ నిర్మాణం పూర్తి కాకుండానే తప్పుడు సమాచారాన్ని అప్ లోడ్ చేసిన బిల్ కలెక్టర్ జగదీష్పై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.