News January 9, 2026
ఖమ్మం జిల్లాలో పునఃప్రారంభమైన వ్యవసాయ యాంత్రీకరణ!

పదేళ్ల విరామం తర్వాత ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించింది. 2025-26కు గాను ఖమ్మం జిల్లాకు రూ.4.37 కోట్ల రాయితీ నిధులను కేటాయించారు. ఎస్సీ, ఎస్టీలకు 50%, ఇతరులకు 40% రాయితీతో యంత్రాలు అందించనున్నారు. ఇప్పటికే 387 మంది రైతులు డీడీలు చెల్లించగా, తొలి విడతలో 172 యూనిట్లను త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య తెలిపారు.
Similar News
News February 19, 2026
పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు: సీపీ

ఖమ్మం జిల్లాలోని 66 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు సెక్షన్ 163 (BNSS యాక్ట్) అమలులో ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. పరీక్షల సందర్భంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కేంద్రాలకు 200 మీటర్ల లోపు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని ఆదేశించారు. ఎలాంటి సభలు, ర్యాలీలు నిర్వహించకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 19, 2026
చిరుప్రాయంలో గుండెకోత.. ఆదుకోండి

వైరా(M) తాటిపూడికి చెందిన కట్టా రామకృష్ణ మూడేళ్ల కుమారుడు శ్రీహర్ష ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.18రోజులుగా గుండెసమస్యతో బాధపడుతున్న ఈ చిన్నారి,HYDలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. వైద్యానికి రూ. 22.70 లక్షలు ఖర్చవుతాయని, అంత స్తోమత తమకు లేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉదారహృదయులు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
News February 19, 2026
ఖమ్మం: భోజనం చేస్తూ వ్యక్తి గుండెపోటుతో మృతి

కారేపల్లి మండలం దుబ్బతండాకు చెందిన శ్రీను (38) మణుగూరులోని బంధువుల ఇంట్లో భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించారు. బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. శ్రీను ఆకస్మిక మరణంతో దుబ్బతండా గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.


