News October 13, 2025
ఖమ్మం జిల్లాలో భారీగా తగ్గిన మిర్చి సాగు..!

విదేశాల్లో డిమాండ్ ఉన్నా, జిల్లాలో మిర్చి సాగు గణనీయంగా తగ్గింది. గతేడాది తీవ్ర నష్టాలు, చీడపీడలతో పెట్టుబడి కూడా దక్కకపోవడంతో రైతులు మిర్చిని తోటలోనే వదిలేశారు. దీంతో ఈసారి చాలామంది రైతులు మిర్చిని పక్కనపెట్టి పత్తి వైపు మొగ్గు చూపారు. గతేడాది 70 వేల ఎకరాల్లో సాగైన మిర్చి, ఈ ఏడాది కేవలం 30 వేల ఎకరాలకే పడిపోవడం గమనార్హం. ఎగుమతులు లేక ధర పడిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News October 13, 2025
ట్రంప్కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం

US అధ్యక్షుడు ట్రంప్కు ఇజ్రాయెల్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మేరకు ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ హానర్’ను ఇవ్వనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ వెల్లడించారు. యుద్ధాన్ని ముగించడంలో సాయం చేసినందుకు, బందీల విడుదలకు చేసిన కృషికి ఈ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. సెక్యూరిటీ, సహకారం, శాంతియుత భవిష్యత్తు కోసం మిడిల్ ఈస్ట్లో ఆయన కొత్త శకానికి నాంది పలికారని కొనియాడారు.
News October 13, 2025
యాదాద్రి: భారీ వర్షం.. తడిసిన ధాన్యం

జిల్లా కేంద్రంలో గత కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్న తరుణంలో, సోమవారం తెల్లవారుజామున ఊహించని విధంగా భారీ వర్షం దంచికొట్టింది. దీంతో ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. వరికోతలు ముమ్మరంగా సాగుతున్న వేళ, ధాన్యాన్ని మార్కెట్కు చేర్చి ఆముదం అనుకుంటున్న సమయంలో వర్షం రావడంతో రైతులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
News October 13, 2025
కరీంనగర్: ప్రకృతి సంపదను ‘తోడేస్తున్నారు’..!

ఉమ్మడి KNRలో గోదావరి, మానేరు నదులను ఇసుక మాఫియా తోడేస్తోంది. అధికార పార్టీ నేతల అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా సాగుతుందన్న టాక్ నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రీచుల్లో రాత్రింబవళ్లు తేడా లేకుండా ఇసుకను తోడేసి తరలిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన మైనింగ్ శాఖ, TGMDC చూసీచూడనట్లు వ్యవహరించడంపై విమర్శలొస్తున్నాయి. KNR, RGM CPలు ఇసుకాసురలకు చెక్ పెట్టి ప్రకృతి సంపదను కాపాడాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.