News November 11, 2024

ఖమ్మం జిల్లాలో ముమ్మరంగా కుటుంబ సర్వే

image

ఖమ్మం జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా 5,71,240 లక్షల ఇళ్లు ఉండగా ఆదివారం నాటికి 30,616 ఇళ్లు మాత్రమే సర్వే చేశారు. జిల్లాలో 4,118 బ్లాక్‌లుగా విభజించగా ప్రస్తుతం 3,150 బ్లాక్‌లలో సర్వే జరుగుతుంది. 75 ప్రశ్నలతో కూడిన ఫామ్‌ను నింపడానికి దాదాపు 30 నిమిషాలు పడుతున్నట్లు తెలుస్తొంది.

Similar News

News February 13, 2026

ధర్మంపై అధర్మమే గెలిచింది: పొంగులేటి సుధాకర్ రెడ్డి

image

ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో ధర్మంపై అధర్మమే విజయం సాధించిందని BJP జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో డబ్బు రాజకీయాలే పైచేయి సాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విజయం కేవలం “ధనబలంతో కూడిన రాజకీయాలదే తప్ప, ప్రజల నిజమైన తీర్పు కాదు. ప్రజలు ఈ విషయాన్ని త్వరలోనే గ్రహిస్తారు” అని అభిప్రాయపడ్డారు.

News February 13, 2026

ర్యాలీలు, సంబరాలపై నిషేధం: ఖమ్మం సీపీ సునీల్ దత్

image

మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, వేడుకలకు అనుమతి లేదని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్పష్టం చేశారు. కమిషనరేట్ వ్యాప్తంగా సెక్షన్ 163 BNSS అమలులో ఉన్నందున నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాణసంచా కాల్చడం, డీజేల వినియోగం, బైక్ ర్యాలీలు, బహిరంగ సభలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించినట్లు తెలిపారు.

News February 13, 2026

ఖమ్మం: భక్తులకు గమనిక

image

మహాశివరాత్రి పండగను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఖమ్మం ఆర్ఎం సరీరామ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తీర్థాలకు, స్థానాల లక్ష్మీపురం, నీలాద్రి, అన్నపురెడ్డి పల్లి, మోతేగడ్డ, బెండలపాడు దేవాలయాలకు స్థానిక డిపోల-79 బస్సులు రాకపోకలు సాగిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలన్నారు.