News May 13, 2024

ఖమ్మం జిల్లాలో 230 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: సీపీ సునీల్ దత్

image

పోలింగ్ కేంద్రాల పరిధిలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. పొన్నెకల్లులోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. పోలింగ్ ముగిశాక ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌కు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. 230 సమస్యాత్మక కేంద్రాల్లో కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటుచేసినట్లు వివరించారు.

Similar News

News November 10, 2025

రాష్ట్రంలోనే తొలిసారి ఖమ్మం జిల్లాలో

image

రాష్ట్రంలోనే తొలిసారి ఖమ్మం జిల్లాలో ఐకేపీ సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఎర్రుపాలెం మండలం వెంకటాపురంలో ప్లాంట్ నిర్మాణానికి 4 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ ప్లాంట్ నిర్వహణ మహిళ సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్లాంట్ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు. 25 ఏళ్లపాటు వారంటీతో కూడిన సోలార్ పలకలు ఏర్పాటు చేయనున్నారు.

News November 10, 2025

పాత కక్షలతో హత్య.. ఇద్దరు నిందితులు అరెస్టు

image

ఎదులాపురం ముత్తగూడెంకు చెందిన బురా శ్రీనివాస్‌ను పాత కక్షల నేపథ్యంలోనే హత్య చేసినట్లు రూరల్ సీఐ ఎం. రాజు తెలిపారు. బురా డేవిడ్, పేరెల్లి రాజశేఖర్ సుపారీ మాట్లాడుకుని శ్రీనివాస్‌ను కారులో కిడ్నాప్ చేసి, గొంతు నులిమి చంపి, మృతదేహాన్ని ఎన్ఎస్‌పీ కెనాల్‌లో పడేశారని సీఐ వెల్లడించారు. భార్య ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

News November 8, 2025

ఖమ్మం: కడుపునొప్పి తాళలేక కార్మికుడి ఆత్మహత్య

image

తీవ్రమైన కడుపునొప్పిని భరించలేక మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికుడు తగరం నాగరాజు (36) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగరాజు ఉరివేసుకున్నాడు. ఈ విషయం స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.