News March 10, 2025
‘ఖమ్మం జిల్లాలో TODAY హెడ్లైన్స్’

√కారేపల్లి: ప్రజావాణి కార్యక్రమంలో భారీగా దరఖాస్తులు √ఖమ్మం: పారదర్శకంగా సేవలు అందించాలి: కలెక్టర్ √ఖమ్మం: TGSRTC లాజిస్టిక్స్ కేంద్రాల నిర్వాహణకు దరఖాస్తులు √వేంసూర్ పామాయిల్ ఫ్యాక్టరీకి రూ.240కోట్లు: ఎమ్మెల్యే √ఖమ్మం: హోలీ వేడుకల ప్రచారాన్ని ఖండిస్తున్నాం: ప్రిన్సిపల్ √సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి గాయాలు √ఖమ్మం: వ్యవసాయ రంగంపై సీఎం ప్రత్యేక దృష్టి: మంత్రి తుమ్మల
Similar News
News March 11, 2025
విజయవంతంగా ముగిసిన LRS అవగాహన సెమినార్

ఖమ్మం జిల్లాలో LRSపై ఏర్పాటు చేసిన అవగాహన సెమినార్ విజయవంతంగా ముగిసిందని జిల్లా రిజిస్ట్రార్ ఎం. రవీందర్ రావు తెలిపారు. సోమవారం ఖమ్మం జెడ్పీ సమావేశ మందిరంలో LRSపై అవగాహన సెమినార్ను నిర్వహించారు. LRSపై సభ్యులు అడిగిన వివిధ సందేహాలను పూర్తిస్థాయిలో నివృత్తి చేశామని చెప్పారు. LRSకు సంబంధించి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచే సినట్లు జిల్లా రిజిస్ట్రార్ పేర్కొన్నారు.
News March 11, 2025
ఖమ్మం: ప్రీ బడ్జెట్పై డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం

డా.బీ.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో 2025-26 వార్షిక సంవత్సరానికి సంబంధించి నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల అధికారులతో సహచర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం ప్రీ బడ్జెట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగేలా బడ్జెట్ రూపొందించాలని చర్చించారు.
News March 11, 2025
ఖమ్మం: TGSRTC లాజిస్టిక్స్ కేంద్రాల నిర్వాహణకు దరఖాస్తులు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎన్కూర్, జూలూరుపాడు, సుజాతనగర్, దమ్మపేట, టేకులపల్లి, కూసుమంచి, కారేపల్లి మండల కేంద్రాలలో TGSRTC లాజిస్టిక్స్ కేంద్రాల నిర్వాహణకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్గో ATM రామారావు తెలిపారు. లాజిస్టిక్స్ కేంద్రాలను నడిపేందుకు కంప్యూటర్, ప్రింటర్, వేయింగ్ మిషన్ కలిగి ఉండాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9154298582 సంప్రదించాలన్నారు.