News May 23, 2024
ఖమ్మం జిల్లా అంతటా గట్టి నిఘా..!
పత్తి విత్తనాలపై ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖతో పాటు టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గతంలో అనేకసార్లు జిల్లాలో రైతులు నకిలీ విత్తనాలను కొని మోసపోయి దిగుబడి రాక నష్టాల పాలైన ఘటనలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రస్తుత సీజన్లో నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. విత్తనాల శాంపిల్స్ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించనున్నారు.
Similar News
News October 1, 2024
KMM: దసరా పండుగకు 724 ప్రత్యేక బస్సులు
దసరా పండుగ సందర్భంగా TGSRTC సుమారుగా 724 బస్సులను ప్రత్యేకంగా నడపనున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరిరామ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం – హైదరాబాద్ మార్గంలో నాన్ స్టాప్ షటిల్ సర్వీసులు నడపబడునని తెలిపారు. ఈనెల 9 నుంచి 11 వరకు హైదరాబాద్ – ఖమ్మం 13, 14 తేదీలలో ఖమ్మం – హైదరాబాద్కు నిత్యం తిరిగే 154 బస్సులతో పాటు అదనంగా 100 బస్సులను నడపనున్నట్లు తెలిపారు.
News October 1, 2024
ఖమ్మం: ‘గంజాయి అమ్మిన కొన్నా కఠిన చర్యలు’
ఖమ్మం జిల్లాలో పట్టుబడిన 2.80కోట్ల గంజాయిని ఎక్సైజ్ అధికారులు దగ్ధం చేశారు. జిల్లాలోని ఆరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 72 కేసుల్లో పట్టుకున్న 1120 కేజీల గంజాయిని దగ్ధం చేశారు. ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్దన్రెడ్డి మాట్లాడుతూ.. యువత గంజాయి వంటి అన్ని రకాల మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా గంజాయి అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 1, 2024
పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!
సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అని ఖమ్మం, భద్రాద్రి జిల్లావాసులు ఆలోచనలు పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.