News April 10, 2025
ఖమ్మం జిల్లా నేటి ముఖ్యంశాలు.!

☆ నియోజకవర్గ మార్పుపై స్పష్టత ఇచ్చిన మంత్రి పొంగులేటి☆ కార్మికులు ఉపాధితో పాటు కుటుంబ భద్రత పై దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ ☆ ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు☆ ₹14 కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులకు కార్యాచరణ: మంత్రి పొంగులేటి☆ మైనర్ డ్రైవింగ్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన ట్రాఫిక్ పోలీసులు☆ రేషన్ లబ్ధిదారుల ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే
Similar News
News April 18, 2025
ఖమ్మం: అనుమానస్పద స్థితిలో బావిలో బాలుడి మృతదేహం

అనుమానాస్పద స్థితిలో ఓ బాలుడి మృతదేహం బావిలో లభ్యమైన ఘటన శుక్రవారం బోనకల్ మండలంలో చోటు చేసుకుంది. లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలోని వ్యవసాయ బావిలో తెల్లవారుజామున ఓ బాలుడి మృతదేహం తేలియాడుతూ స్థానికుల కంటపడింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడా? లేక ఎవరైనా హత్య చేశారా? వంటి కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతుంది.
News April 18, 2025
ఏఐకేఎస్ జాతీయ కార్యవర్గంలో ముగ్గురికి స్థానం

ఏఐకేఎంఎస్ జాతీయ సమితిలో ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురికి స్థానం లభించింది. తమిళనాడులో ముగిసిన జాతీయ మహాసభల్లో 36 మందితో జాతీయ కార్యవర్గం, 115 మందితో జాతీయ కౌన్సిల్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నేలకొండపల్లికి చెందిన బాగం హేమంతరావు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. చింతకాని మండలం రాఘవాపురానికి చెందిన కొండపర్తి గోవిందరావుతో పాటు మందడపు రాణికి జాతీయ కౌన్సిల్ సభ్యులుగా స్థానం దక్కింది.
News April 18, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుకలు ∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన∆} వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} కల్లూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం సంబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం