News December 22, 2025
ఖమ్మం జిల్లా రైతులకు రూ.68 కోట్ల బోనస్ జమ

ఖమ్మం జిల్లాలో సన్నరకం ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ సొమ్మును ఖాతాల్లో జమ చేస్తోంది. వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 22,000 మంది రైతులకు రూ.68.34 కోట్లు చెల్లించారు. ఇంకా 11,900 మందికి రూ.34.06 కోట్లు అందాల్సి ఉంది. అత్యధికంగా కల్లూరు మండలంలో రూ.20.28 కోట్లు, వేంసూరులో రూ.8.87 కోట్లు జమ చేశారు. మిగిలిన బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని అధికారులు వెల్లడించారు.
Similar News
News December 30, 2025
న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ

నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 31 రాత్రి జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లపై వేడుకలు నిర్వహించడం నిషిద్ధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ ఏర్పాటు చేశామన్నారు.
News December 30, 2025
GOOD NEWS చెప్పిన ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి వచ్చేవరకు పాత పద్ధతిలోనే ఎరువుల సరఫరా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలను పరిశీలించి, వారు సాగు చేస్తున్న పంట విస్తీర్ణానికి అనుగుణంగా యూరియా కేటాయించాలని అధికారులను ఆదేశించారు. అన్ని కేంద్రాల్లో ఉదయం 6 గంటల నుంచే పంపిణీ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఎరువుల నిల్వలపై రైతులు ఆందోళన చెందవద్దన్నారు.
News December 30, 2025
ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలపై బ్యాంకర్లు దృష్టి సారించాలి: అ. కలెక్టర్

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల విజయవంతానికి బ్యాంకర్లు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి సూచించారు. కలెక్టరేట్లో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో మాట్లాడారు. రెండో త్రైమాసికం ముగిసే నాటికి జిల్లాలో ప్రాధాన్యత రంగం కింద నిర్దేశించుకున్న రుణ పంపిణీ లక్ష్యంలో 54.15 శాతం పూర్తి చేసినట్లు వెల్లడించారు. మిగిలిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కోరారు.


