News February 27, 2025
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 93% పోలింగ్ నమోదు

ఖమ్మం జిల్లాలో MLC ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు 93% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లాలో 4089 ఓటర్లు ఉండగా 3805 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News December 30, 2025
ఖమ్మం: రూ.2.5 లక్షలతో జర్మనీలో ఉద్యోగావకాశాలు

‘టామ్కామ్’ ఆధ్వర్యంలో నర్సులకు ఉచితంగా జర్మన్ భాషా శిక్షణ ఇచ్చి, జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీరామ్ తెలిపారు. బీఎస్సీ లేదా జీఎన్ఎమ్ పూర్తి చేసి, ఏడాది క్లినికల్ అనుభవం ఉన్న 22-38 ఏళ్ల వారు అర్హులు. ఎంపికైన వారికి శిక్షణ అనంతరం నెలకు రూ.2.5 నుంచి 3 లక్షల వేతనం లభిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
News December 30, 2025
చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు: ఖమ్మం CP

సంక్రాంతి పండుగ వేళ పక్షులు, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న నిషేధిత చైనా మాంజాను విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. పక్షుల విహారానికి, ప్రజల భద్రతకు భంగం కలిగించే ఈ మాంజా విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఎవరైనా చైనా మాంజాను విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100కి లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
News December 30, 2025
న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ

నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 31 రాత్రి జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లపై వేడుకలు నిర్వహించడం నిషిద్ధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ ఏర్పాటు చేశామన్నారు.


