News April 7, 2025
ఖమ్మం జైలును సందర్శించిన శాఖ డీజీపీ సౌమ్య మిశ్రా

ఖమ్మం జిల్లా జైలును ఆదివారం జైళ్ల శాఖ డీజీపీ డాక్టర్ సౌమ్య మిశ్రా ఐపీఎస్ సందర్శించారు. ఈ సందర్భంగా జైలులో ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను, అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు అందుతున్న ఆహారం, వైద్యం, న్యాయ సహాయాలు సక్రమంగా అందుతున్నాయా? లేదా అని విచారించారు. ఈ క్రమంలో ఖైదీల కోసం ఏర్పాటు చేసిన లైబ్రరీని సందర్శించి, సంతృప్తి వ్యక్తం చేశారు.
Similar News
News November 12, 2025
విశాఖలో నేటి నుంచి డ్రోన్ ఎగురవేయుట నిషేదం

విశాఖలో భాగస్వామ్య సదస్సులు జరగనున్న నేపథ్యంలో నగరవాసులకు సీపీ శంఖబ్రత బాగ్చి మంగళవారం పలు సూచనలు చేశారు. ఈనెల 12వ తేదీ నుుంచి 16వ తేదీ వరకు ఏయూ నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ ఎగురవేయట నిషేధమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని విశాఖ ప్రజలు గమనించాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా డ్రోన్ ఎగురవేస్తే చట్టప్రకారమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News November 12, 2025
ముక్కిడిగుండం: అటవీ అధికారులపై గిరిజనుల దాడి

ముక్కిడిగుండం గ్రామంలో అటవీభూమిలో చెట్లను నరికుతున్న గిరిజనులను అడ్డుకునే ప్రయత్నంలో ఫారెస్ట్ సిబ్బందిపై దాడి జరిగింది. వత్తిమక్కులకుంట దగ్గర సుమారు 15 ఎకరాల అటవీ భూమిలో చెట్లు నరికుతున్నారని సమాచారం అందడంతో ఫారెస్ట్ అధికారి జయరాం అక్కడికి చేరుకోగా, అతనిపై దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ రేంజర్ ఈశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని దాడిచేసిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
News November 12, 2025
హైపర్ పేరెంటింగ్ గురించి తెలుసా?

ఈ పేరెంటింగ్ పద్ధతిలో తల్లిదండ్రులు పిల్లల ప్రతి తప్పు, సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. వారు ప్రతి అంశంలోనూ ఉత్తమంగా ఉండాలని కోరుకుంటారు. దీంతో పిల్లలపై ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది. సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండదు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పులు చేస్తే అంగీకరించరు. దీంతో పిల్లలు కూడా వారిని అర్థం చేసుకోలేరు. ఇలా తల్లిదండ్రులు, పిల్లల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది.


