News December 24, 2025

ఖమ్మం: తల్లి అనారోగ్యం తట్టుకోలేక కూతురు ఆత్మహత్య

image

కన్నతండ్రి మరణం, తల్లి అనారోగ్యంతో ఆసుపత్రి పాలవ్వడాన్ని తట్టుకోలేక ఓ డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఖమ్మం కవిరాజు నగర్‌కు చెందిన బట్ల సృజన తండ్రి 7ఏళ్ల క్రితం మృతి చెందగా, తల్లి మేరీ పద్మ అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. దీంతో మనస్తాపం చెందిన సృజన.. బుధవారం ఇంట్లో ఉరివేసుకుంది. మరణానికి ముందు చిన్నప్పుడు తల్లితో దిగిన ఫొటోపై ‘క్షమించు అమ్మా.. నీకంటే ముందే వెళ్తున్నా’ అని రాసింది.

Similar News

News December 25, 2025

ప్రోటోకాల్‌ రగడ.. ఎమ్మెల్యే కవ్వంపల్లికి వరుస అవమానాలు

image

KNR(D)లో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో MLA కవ్వంపల్లి సత్యనారాయణను విస్మరిస్తూ తరచూ ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతోంది. నిన్న మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆహ్వానం అందకపోవడం, ఫ్లెక్సీల్లో ఫోటో లేకపోవడం వివాదాస్పదమైంది. గతంలో సన్నబియ్యం పంపిణీ, గణేశ్ మండపాల విద్యుత్ ఫ్లెక్సీల్లోనూ ఇదేతీరు పునరావృతమైంది. అధికారుల వివక్షపై కాంగ్రెస్ శ్రేణులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి.

News December 25, 2025

ADB: ఆన్‌లైన్ గేమ్లకు బానిస.. కుమారుడిపై తల్లి ఫిర్యాదు

image

ఆన్‌లైన్ గేమ్లకు బానిసగా మారిన తన కుమారుడిపై తల్లి ఆదిలాబాద్ టూటౌన్‌లో బుధవారం ఫిర్యాదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు. షేక్ సోహెల్ ఆన్‌లైన్ ఆటలు ఆడుతూ డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు తరచూ డబ్బులివ్వాలని తల్లిని, భార్యను శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు విద్యానగర్‌లో ఉండే సామెరా బీ ఫిర్యాదు చేసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

News December 25, 2025

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ కూడా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.320 పెరిగి రూ.1,39,250కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.300 ఎగబాకి రూ.1,27,650 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,000 పెరిగి రూ.2,45,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.