News October 11, 2025
ఖమ్మం: తీవ్ర విషాదం.. ఇద్దరు చిన్నారులు మృతి

ముదిగొండ మండలం పెద్ద మండవ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. బైక్ను ఇసుక ట్రాక్టర్ బలంగా ఢీకొనడంతో.. పెద్దమండవకు చెందిన పేరం ప్రవీణ్(14), గొర్రె మచ్చు సనా(9) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి గొర్రెముచ్చు సాయికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 11, 2025
వారికి సరోగసీ నిబంధనలు వర్తించవు

సరోగసీ పేరెంట్స్ 2022 జనవరి 25కు ముందే పిండాలను శీతలీకరించే ప్రక్రియను చేపట్టి ఉంటే సరోగసీ చట్టం-2021లోని వయోపరిమితి నిబంధనలు వారికి వర్తించవని సుప్రీంకోర్టు పేర్కొంది. 2021లో రూపొందించిన చట్టం ఆ మరుసటి ఏడాది జనవరి 25 నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రులుగా మారాలని ఆకాంక్షిస్తున్న వివాహితుల్లో భార్య వయసు 23-50 ఏళ్ల మధ్య ఉండాలి. తండ్రి వయసు 26-55 ఏళ్ల మధ్య ఉండాలి.
News October 11, 2025
HYDలో వేసవి విద్యుత్ డిమాండ్ తట్టుకునేలా చర్యలు

HYDలో ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ తట్టుకునేలా చర్యలకు ఉపక్రమించినట్లుగా TGSPDCL ఎండీ ముషారఫ్ అలీ తెలిపారు. ఈ మేరకు రెండు రోజులు వర్చువల్, ఆన్ ఆఫీస్ పద్ధతిలో సర్కిల్ స్థాయిలోని అధికారులకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి దిశనిర్దేశం చేశారు. ఇప్పటి నుంచి ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. ఈసారి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
News October 11, 2025
HYDలో వేసవి విద్యుత్ డిమాండ్ తట్టుకునేలా చర్యలు

HYDలో ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ తట్టుకునేలా చర్యలకు ఉపక్రమించినట్లుగా TGSPDCL ఎండీ ముషారఫ్ అలీ తెలిపారు. ఈ మేరకు రెండు రోజులు వర్చువల్, ఆన్ ఆఫీస్ పద్ధతిలో సర్కిల్ స్థాయిలోని అధికారులకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి దిశనిర్దేశం చేశారు. ఇప్పటి నుంచి ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. ఈసారి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.