News March 2, 2025
ఖమ్మం: దివ్యాంగులకు ఆ కార్డులు తప్పనిసరి: అదనపు కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని ప్రతి దివ్యాంగుడికి యూనిక్ డిజేబిలిటీ ఐడీ నంబర్ జనరేట్ చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ అన్నారు. మార్చి 1 నుంచి సదరం సర్టిఫికెట్ విధానాన్ని రద్దు చేసి, యూడీ ఐడీ. కార్డులు జారీ చేయనున్నారు. నూతన దివ్యాంగులు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, సదరం ఉన్నవారికి డీఆర్డీవోల ద్వారా యూడీ ఐడీ కార్డు జారీ చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఉపయోగపడుతోందని తెలిపారు.
Similar News
News March 3, 2025
BRS నేత సుబ్బారావుకు KCR రూ.10 లక్షల ఆర్థిక సాయం

ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఖమ్మం టౌన్ పార్టీ మాజీ అధ్యక్షుడు డోకుపర్తి సుబ్బారావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సుబ్బారావును ఎర్రవెల్లిలోని ఫాంహౌస్కు ఆహ్వానించి ఆయన ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య ఖర్చుల కోసం రూ.10లక్షల చెక్కును స్వయంగా సుబ్బారావుకు అందజేశారు.
News March 2, 2025
ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు

✓: ఖమ్మం: ‘రాణా పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యా యత్నం’✓: 8న లోక్ అదాలత్: కారేపల్లి ఎస్ఐ✓: నేలకొండపల్లి:పొంగులేటి చొరవతో షాదీఖానాకు రూ.50లక్షలు✓:ఖమ్మం: ‘ఆలయం ఎదుట అశ్లీల నృత్యాలు’✓ ఖానాపురం:తప్పుడు పత్రాల రిజిస్ట్రేషన్ల ముఠాపై కేసు నమోదు✓చింతకాని: కారులోనే లింగ నిర్ధారణ పరీక్షలు.. ఇద్దరు అరెస్ట్✓:ఖమ్మం: 20లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు: మంత్రి తుమ్మల
News March 2, 2025
కొత్తగూడెంకి ఎయిర్ పోర్ట్.. కేంద్రమంత్రి క్లారీటీ..!

కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. గతంలో ప్రభుత్వం ఓ స్థలం కేటాయించిందని.. కానీ ఆస్థలం ఫీజుబిలిటీ లేదని ప్రభుత్వానికి తెలపగా మరో స్థలం కేటాయించిందన్నారు. అక్కడ AAI ఫీజుబిలిటీ స్టడీ చేసిందన్నారు. కానీ ఆ స్థలానికి రిమార్క్స్ ఉన్నాయని ఆ ప్రాంతం డేటా కావాలని ప్రభుత్వానికి సూచించామన్నారు. ఆ డేటా వచ్చిన తరువాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.