News October 15, 2025

ఖమ్మం: ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష

image

ఖమ్మం కలెక్టరేట్‌లో బుధవారం వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్లతో అనుదీప్ దురిశెట్టి సమీక్షించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. జిల్లాలోని 5 వ్యవసాయ మార్కెట్ యార్డుల వద్ద డ్రైయర్లను ఏర్పాటు చేయాలని, అందుబాటులో ఉన్న మ్యానువల్ ప్యాడీ క్లీనర్లను కొనుగోలు కేంద్రాలకు కేటాయించాలని ఆదేశించారు.

Similar News

News October 15, 2025

రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ, షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు: ఖమ్మం CP

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖ ఫోటోగ్రఫీ, షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలను నిర్వహిస్తోంది. పోలీసుల సేవలు, త్యాగాలు, కీర్తి ప్రతిష్ఠలను ప్రతిబింబించే అంశాలపై ఫోటోలు, షార్ట్‌ ఫిల్మ్‌లను ఈ నెల 22వ తేదీలోపు పీఆర్‌వో నంబర్‌ 87126 59256కు పంపాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.

News October 15, 2025

ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు: కలెక్టర్‌ అనుదీప్‌

image

ఖమ్మం: రైతులు పండించిన నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో వానాకాలం పంటల మద్దతు ధర గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఈ ఏడాది క్వింటాలు గ్రేడ్‌ ఏ ధాన్యానికి ₹2389, పత్తికి ₹8110 మద్దతు ధర నిర్ణయించినట్లు చెప్పారు. రైతులు కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా సీసీఐ కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు.

News October 15, 2025

కార్తిక సోమవారం.. పంచారామాలకు ప్రత్యేక బస్సు

image

ఖమ్మం: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం RTC ఖమ్మం విభాగం ప్రత్యేక సర్వీసును ప్రకటించింది. ఖమ్మం కొత్త బస్టాండ్ నుంచి అమరావతి, భీమవరం, ద్రాక్షారామం, పాలకొల్లు, సామర్లకోటకు సూపర్‌ లగ్జరీ బస్సు నడుపుతోంది. ఈ నెల 26న రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరుతుంది. టికెట్‌ ధర పెద్దలకు రూ.2,300, పిల్లలకు రూ.1,200గా నిర్ణయించామని, వివరాలకు 91364 46666 నెంబర్‌ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.