News April 17, 2025
ఖమ్మం: నేటి నుంచి భూభారతిపై అవగాహన సదస్సు

ఖమ్మం జిల్లాలో రైతులకు, ప్రజలకు భూ భారతి చట్టంపై ఈనెల 17 నుంచి 30 వరకు రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు 2 మండల కేంద్రాల్లో అవగాహన సమావేశాలు నిర్వహిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. కొత్త ఆర్ఓఆర్ చట్టం అమలుపై సమగ్రంగా అధికారులు వివరిస్తారని, ప్రజలకు ఏలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చునని ఆమె సూచించారు.
Similar News
News April 19, 2025
ఖమ్మం: ఈనెల 20న నెల నెలా వెన్నెల కార్యక్రమం

ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఈ నెల 20న సాయంత్రం 6 గంటలకు నెల నెలా వెన్నెల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మోటమర్రి జగన్మోహన్ రావు, అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్, కె.దేవేంద్ర, నాగబత్తిని రవి, వేల్పుల విజేత, లక్ష్మీనారాయణ, వేముల సదానందం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన సిరిమువ్వ కల్చరల్స్ కళాబృందం ‘హక్కు’ నాటిక ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
News April 18, 2025
ఖమ్మం: ఫైనాన్స్ వేధింపులు.. యువకుడి SUICIDE

ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం(D) బోనకల్(M) గోవిందపురం(ఎల్)లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇసంపల్లి సైదా గత కొద్ది రోజుల క్రితం ఓ కంపెనీలో ఫైనాన్స్ తీసుకోగా ఈఎంఐ చెల్లించకపోవడంతో ఫైనాన్సర్ వేధింపులు ఎక్కువయ్యాయి.. దీంతో మనస్తాపం చెంది, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని గ్రామస్థులు తెలిపారు. మృతుడి భార్య ఠాణాలో ఫిర్యాదు చేశారు.
News April 18, 2025
ఖమ్మం: CMRF గందరగోళం.. ఆసుపత్రులకు నోటీసులు

పేదలకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి బిల్లులను ఖమ్మంలోని పలు ఆసుపత్రులు నకిలీ బిల్లులు సృష్టించి రూ.లక్షల విలువ గల CMRF చెక్కులను కాజేశాయి. ఈ అంశంపై కొద్దినెలల క్రితం సీఎంఓకు అందిన ఫిర్యాదుతో పలు ఆసుపత్రులపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. నేడు తాజాగా ఆ ఆసుపత్రులకు నోటీసులు పంపి, రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ఆదేశించారు. పేదలకు అందాల్సిన పథకం నిర్వీర్యం అవుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు.