News April 2, 2025
ఖమ్మం: పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్

అర్హులైన యువత రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ తెలిపారు. మంగళవారం మధిర మండలం దెందుకూరు గ్రామంలో రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల ప్రక్రియను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత దరఖాస్తు దారులతో అదనపు కలెక్టర్ ఇంటరాక్ట్ అయ్యారు.
Similar News
News April 3, 2025
యువ వికాసం అమలుకు కట్టుదిట్టమైన చర్యలు: కలెక్టర్

ఖమ్మం: యువ వికాసం అమలుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గ్రామాలలో రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. జూన్ నెల నాటికి యూనిట్ల గ్రౌండింగ్ కోసం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
News April 2, 2025
ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

∆}ఖమ్మం:శ్రీశైలం మల్లన్న సేవలో తెలంగాణ మంత్రి పొంగులేటి∆} ఖమ్మం: ఏప్రిల్ నెలాఖరు నాటికి ప్లాస్టిక్ రహితం చేయాలి: కలెక్టర్∆}మధిర: నిజాయితీ చాటుకున్న కండక్టర్∆}ఖమ్మం రూరల్: భూ కబ్జాలో నలుగురికి రిమాండ్∆} నేలకొండపల్లి:ట్రైన్ క్రింద పడి కానిస్టేబుల్ మృతి∆}బోనకల్ లో ట్రైన్ ఢీకొని వ్యక్తి మృతి∆}ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి: మంత్రి తుమ్మల
News April 2, 2025
మహనీయుల జయంతి వేడుకలను విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్

ఖమ్మం: డా. బాబు జగ్జీవన్ రామ్, డా.బి.ఆర్. అంబేడ్కర్ వంటి మహనీయుల జయంతి వేడుకలలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహనీయుల జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జయంతి వేడుకలలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్ని సంఘాల నాయకులు, అన్ని వర్గాల ప్రజలందరూ పాల్గొనాలని పేర్కొన్నారు.