News July 29, 2024
ఖమ్మం: పనిచేస్తూ పొలంలో ప్రాణాలు విడిచాడు

వరి పొలంలో నారు కట్టలు పంచేందుకు వెళ్లి ఓ వ్యక్తి మూర్చతో పొలంలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బచ్చోడుకి చెందిన సైదులు (42) ఆదివారం గ్రామంలోని ఓ రైతు వరి పొలంలో నారు కట్టలు పంచేందుకు వెళ్లాడు. సైదులుకు మూర్చ రావడంతో బురదలో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 16, 2026
ఏపీ నుంచి ఇసుక రవాణాపై ఖమ్మం సీపీ హెచ్చరిక

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఏపీ నుంచి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటల నిఘా కొనసాగించాలన్నారు. అక్రమ రవాణా, నిల్వలపై కేసులు నమోదు చేసి వాహనాలను జప్తు చేయాలని తెలిపారు. స్థానిక అవసరాలకు మైనింగ్ నిబంధనల ప్రకారం ఇసుక వినియోగించాలని కాంట్రాక్టర్లకు సూచించారు.
News February 16, 2026
అధికారులతో ఖమ్మం కలెక్టర్ సమీక్ష

ఖమ్మంలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు, రబీ ధాన్యం సేకరణ, తాగునీటి సరఫరా, రోడ్డు భద్రతపై అధికారులతో కలెక్టర్ అనుదీప్ సమీక్షించారు. ఆసుపత్రుల్లో సిబ్బంది అందుబాటులో ఉండి వసతులు మెరుగుపరచాలని, నిర్లక్ష్యం సహించబోమన్నారు. వేసవిలో మిషన్ భగీరథ ద్వారా నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని, రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రమాదాలు జరగకుండా రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించాలన్నారు.
News February 15, 2026
ఐదు మున్సిపాలిటీలకు కాంగ్రెస్ విప్ల నియామకం

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విప్లను నియమించినట్లు డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు.. ఏదులాపురానికి దయాకర్ రెడ్డి, మధిరకు ధనికుమార్, వైరాకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కల్లూరుకు ప్రసాద్ రెడ్డి, సత్తుపల్లికి ఎమ్మెల్యే రాగమయిలను విప్లుగా ఖరారు చేశారు.


