News September 11, 2025

ఖమ్మం: పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సాయంత్రం వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో ఈ విషాదం నెలకొంది. మధిర, సత్తుపల్లి, గుండాల మండలాల్లో పిడుగుపాటుకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. టేకులపల్లి, కామేపల్లి మండలాల్లో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Similar News

News September 11, 2025

TTD బోర్డు సభ్యుడిగా సుదర్శన్ వేణు నియామకం

image

TTD బోర్డు సభ్యుడిగా సుదర్శన్ వేణును నియమిస్తూ దేవాదాయశాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి ఎం హరి జవహర్ లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 29 మంది సభ్యులతో టీటీడీ బోర్డును ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. వీరిలో సభ్యునిగా బాధ్యత తీసుకోని జస్టిస్ హెచ్ ఎల్ దత్తు స్థానంలో తాజాగా సుదర్శన్ వేణును నియమించారు. సభ్యుడి మిగిలి ఉన్న కాలానికి మాత్రమే సుదర్శన్ వేణు పదవిలో ఉంటారని పేర్కొన్నారు.

News September 11, 2025

శిథిలావస్థ గదుల్లో తరగతులు నిర్వహించవద్దు: డీఈఓ

image

జిల్లాలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల్లో విద్యార్థులకు బోధన నిర్వహించవద్దని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. పాఠశాలల్లో ప్రమాదకరంగా ఉన్న గదుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులు తప్పక గమనించాలని సూచించారు. విద్యార్థుల భద్రతే ప్రధానమని, ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న గదుల్లో తరగతులు నిర్వహించకూడదని స్పష్టం చేశారు.

News September 11, 2025

సంగారెడ్డి: NMMS స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

image

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్(NMMS) ఉపకార వేతనాలకు 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సంగారెడ్డి డీఈవో వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. అక్టోబర్ 6వ తేదీ వరకు www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆదర్శ పాఠశాలల విద్యార్థులు మాత్రమే ఈ ఉపకార వేతనాలకు అర్హులని పేర్కొన్నారు.