News December 19, 2024

ఖమ్మం: ప్రజాశాంతి పార్టీ గెలిస్తే సమగ్ర అభివృద్ధి: KA పాల్ 

image

గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ఓడించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రజాశాంతి పార్టీ ద్వారా సర్పంచ్‌గా గెలిస్తే భారీగా నిధులు కేటాయిస్తూ వంద రోజుల్లో ఆ గ్రామాలను సమగ్ర అభివృద్ధి చేసి చూపిస్తామని గురువారం ఖమ్మంలో జరిగిన సమావేశంలో చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయలేక బీజేపీ, కాంగ్రెస్ దేశ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.

Similar News

News December 31, 2025

ఒక్క క్లిక్‌తో వీధి దీపాలు.. ఖమ్మం కార్పొరేషన్ కొత్త ప్రయోగం

image

ఖమ్మం నగర పాలక సంస్థలో విద్యుత్ ఆదా, మెరుగైన సేవల కోసం కమిషనర్ అభిషేక్ ఆగస్త్య’CCMS’ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. నగరంలోని 26,842 వీధి దీపాలను మొబైల్ యాప్ లేదా కంప్యూటర్ ద్వారా నియంత్రించవచ్చు. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో ఇవి వాటంతట అవే ఆరిపోవడం, వెలగడం జరుగుతుంది. దీనివల్ల నెలకు సుమారు రూ.40 లక్షల విద్యుత్ బిల్లు ఆదా అవ్వడమే కాకుండా, మరమ్మతులను కార్యాలయం నుంచే పర్యవేక్షించే వీలుంటుంది.

News December 31, 2025

ఖమ్మం: MRO, కార్యదర్శిపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు

image

ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారనే ఆరోపణలపై పెనుబల్లి MRO శ్రీనివాస్ యాదవ్, చింతగూడెం సెక్రటరీ రవిలను కలెక్టర్ సస్పెండ్ చేశారు. సుమారు రూ.5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా బదలాయించారని వీరిపై అభియోగాలు ఉన్నాయి. గత 15 రోజులుగా ఈ వ్యవహారంపై వెల్లువెత్తిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్ ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ విషయం ఇప్పుడు మండలంలో చర్చనీయాంశమైంది.

News December 31, 2025

ఖమ్మం: MRO, కార్యదర్శిపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు

image

ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారనే ఆరోపణలపై పెనుబల్లి MRO శ్రీనివాస్ యాదవ్, చింతగూడెం సెక్రటరీ రవిలను కలెక్టర్ సస్పెండ్ చేశారు. సుమారు రూ.5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా బదలాయించారని వీరిపై అభియోగాలు ఉన్నాయి. గత 15 రోజులుగా ఈ వ్యవహారంపై వెల్లువెత్తిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్ ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ విషయం ఇప్పుడు మండలంలో చర్చనీయాంశమైంది.