News March 14, 2025
ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో టెండర్లకు ఆహ్వానం

ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రెండేళ్ల కాల పరిమితితో మందులు, శస్త్ర చికిత్స వినియోగ వస్తువులు, ప్రయోగశాల రసాయనాలు, ఆర్థో ఇంప్లాంట్లు, క్యాత్-ల్యాబ్ ఇంప్లాంట్ల కోసం టెండర్లు కోరుతున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల ఏజెన్సీలు మార్చి 20 లోగా టెండర్ ఫారాలు తీసుకొని, దరఖాస్తులను ఏప్రిల్ 11 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించారు.
Similar News
News March 15, 2025
మెగాస్టార్ చిరంజీవికి అవార్డు హర్షం వ్యక్తం చేసిన ఎంపీ

మెగాస్టార్ చిరంజీవికి యునైటెడ్ కింగ్డమ్ ప్రతిష్ఠాత్మక “లైఫ్ టైం అచీవ్ మెంట్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్”పురస్కారాన్ని ప్రకటించడం పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తంచేశారు. సినిమా హీరోగా లక్షలాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొని మెగాస్టార్ గా కీర్తించబడుతున్న చిరంజీవి బ్లడ్,ఐ బ్యాంకులు నెలకొల్పి విశేష సేవలందిస్తున్నారని ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.
News March 15, 2025
“ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు..!!

✓:మంత్రి ఉత్తమ మంత్రి తుమ్మల భేటీ✓:ఖమ్మం జిల్లాలో ఘనంగా హోలీ వేడుకలు ✓:ఖమ్మం:KCRపై సీఎం వ్యాఖ్యలు సరికాదు: MP రవిచంద్ర ✓:సత్తుపల్లి: ఆయిల్ పామ్ గెలల అపహరణ ✓:నేలకొండపల్లి:రుణాలు చెల్లించలేదని పొలాల్లో జెండాలు పాతారు! ✓:ఖమ్మం:కరుణగిరి వద్ద భారీ కొండచిలువ ప్రత్యక్షం ✓:మధిర:పేరెంట్స్,భర్త సహకారంతో లెక్చరర్ గా ✓:ఎర్రుపాలెం: అప్పులు బాధ తాళలేక రైతు ఆత్మహత్య
News March 14, 2025
ఖమ్మం: రుణాలు చెల్లించలేదని జెండాలు పాతారు!

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పంట రుణాలు చెల్లించలేదని రైతులు పొలాల వద్ద బ్యాంక్ అధికారులు జెండాలు పాతారు. నేలకొండపల్లి మండలంలోని కోనాయిగూడెం, అరేగూడెం గ్రామాల్లో రైతులు బ్యాంకులో తీసుకున్న రుణాలు చెల్లించలేదంటూ అధికారులు గురువారం ఎర్రజెండాలు పాతారు. నేలకొండపల్లి డీసీసీబీ బ్రాంచ్ పరిధిలో దాదాపు 20 మంది రైతులు సుమారు రూ.2 కోట్ల మేర బకాయిలు తీసుకొని స్పందించకపోవడంతో జెండాలు పాతినట్లు చెప్పారు.