News February 4, 2025

ఖమ్మం: ప్రొబేషనరీ ఎస్ఐలకు పోస్టింగ్

image

తొమ్మిది మంది ప్రొబేషనరీ సబ్- ఇన్స్‌పెక్టర్లకు (సివిల్) ఐదు నెలల శిక్షణలో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్‌లను కేటాయిస్తూ.. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ట్రైనీ ఎస్ఐలుగా శిక్షణ పూర్తి చేసుకొని ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌కు రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు. అప్పగించిన శాఖపరమైన భాధ్యతలు సక్రమంగా నిర్వహించాలన్నారు. 

Similar News

News February 4, 2025

ఖమ్మం: ఆపరేషన్‌ స్మైల్‌-11 కార్యక్రమం విజయవంతం

image

ఆపరేషన్‌ స్మైల్‌-11 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించిన కార్యక్రమంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో 53 మంది బాల బాలికలను గుర్తించి విముక్తి కలిగించినట్లు తెలిపారు. బాలురు-44, బాలికలు 04 మొత్తం మంది 53 మంది ఉన్నారన్నారు. 16 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారన్నారు.  

News February 4, 2025

KMM: గిరిజన నిరుద్యోగ యువకులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్ గ్రూప్-డి (32,000) పోస్టులకు ఈనెల 22లోగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఉప సంచాలకులు, గిరిజన సంక్షేమ శాఖ తెలిపారు. గిరిజన నిరుద్యోగ యువతకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు 7729961197 నంబర్‌ను సంప్రదించాలని చెప్పారు.

News February 3, 2025

ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలు సైలెంట్.. ఎందుకు? 

image

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయ్యారు. క్యాడర్‌కు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందుబాటులో ఉండడం లేదని టాక్. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నా నేతలు కనిపించడం లేదు. దీంతో ఎన్నికల్లో ప్రజల వద్దకు ఎలా వెళ్లాలి.. ఎలాంటి హామీలు ఇవ్వాలో తెలియక లోకల్ లీడర్స్ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.