News July 10, 2025

ఖమ్మం: బాలిక గర్భవతి.. యువకుడిపై కేసు నమోదు

image

మైనర్ బాలికను గర్భవతి చేసిన యువకుడిపై తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. ఎస్ఐ జగదీష్ వివరాలు ప్రకారం.. బచ్చోడు తండాకు చెందిన ధరావత్ బాలు అనే యువకుడు ఓ మైనర్ బాలిక(16)ను నమ్మించి మోసం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలుపగా వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

Similar News

News July 10, 2025

చంద్రబాబుకు కవిత లేఖ

image

TG: పునర్విభజన సమయంలో APలో కలిపిన 5 గ్రామాలు ఎటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల, పిచ్చుకలపాడును తిరిగి TGలో విలీనం చేయాలని AP CM చంద్రబాబుకు BRS MLC కవిత లేఖ రాశారు. పోలవరం ముంపు పేరిట ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను చీకటి ఆర్డినెన్స్ ద్వారా విలీనం చేసుకున్నారని ఆరోపించారు. ఫలితంగా లోయర్ సీలేరు పవర్ ప్లాంట్‌ను లాగేసుకొని TGలో కరెంట్ కష్టాలకు కారకులయ్యారని కవిత దుయ్యబట్టారు.

News July 10, 2025

ఏపీ సీఎం చంద్రబాబుకు MLC కవిత లేఖ

image

APలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని MLC కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. భద్రాచలంలో అంతర్భాగంగా ఉండి ఏపీలో కలిసిన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలన్నారు. యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని కోరారు.

News July 10, 2025

భర్తతో విడాకులంటూ ప్రచారం.. స్పందించిన నయనతార

image

భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలపై హీరోయిన్ నయనతార స్పందించారు. ‘మా గురించి సిల్లీ న్యూస్ వచ్చినప్పుడు మా రియాక్షన్ ఇదే’ అని భర్త విఘ్నేశ్‌తో తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాలో స్టోరీగా పెట్టారు. వీరికి 2022లో పెళ్లి కాగా ఇద్దరు కుమారులు(ట్విన్స్) ఉన్నారు. విఘ్నేశ్ తమిళ ఇండస్ట్రీలో దర్శకుడిగా, లిరిసిస్ట్‌గా ఉన్నారు. ప్రస్తుతం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీని తెరకెక్కిస్తున్నారు.