News July 23, 2024
ఖమ్మం: బొగత జలపాతంలో యువకుడి మృతి

వాజేడు మండలం బొగత జలపాతం వద్ద విషాదం జరిగింది. స్నేహితులతో కలిసి సరదాగా జలపాతం చూసేందుకు వచ్చిన వరంగల్ జిల్లాకు చెందిన యువకుడు జశ్వంత్(19) కొలనులో గల్లంతై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంకటాపురం పోలీసులు గజ ఈతగాళ్ళతో వెతికించి మృతదేహాన్నీ సాయంత్రం వెలికి తీశారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న జలపాతంలోకి ఎవరూ దిగొద్దని ఇప్పటికే అటవీశాఖ, పోలీసులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు.
Similar News
News December 27, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} మధిరలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు
∆} సత్తుపల్లిలో మంత్రి తుమ్మల పర్యటన
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} పాలేరులో మంత్రి పొంగులేటి పర్యటన
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
News December 26, 2025
ఖమ్మంలో ఎన్ఐఏ సోదాలు జరగలేదు: పోలీసులు

ఖమ్మం నగరంలోని విద్యాసంస్థల యజమానుల ఇళ్లపై <<18670988>>జాతీయ దర్యాప్తు సంస్థ<<>>(NIA) సోదాలు నిర్వహించినట్లు వస్తున్న వార్తలను స్థానిక పోలీసులు ఖండించారు. పాలస్తీనా సంఘీభావ ర్యాలీ నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగినట్లు ప్రచారం జరగగా, అందులో వాస్తవం లేదన్నారు. అయితే, 5 రోజుల క్రితం సీబీఎస్ఈ ప్రాంతీయ అధికారి ఒకరు పాఠశాలలను సందర్శించి, నిబంధనల అమలుపై ఆరా తీసినట్లు సమాచారం. తప్పుడు వార్తలను నమ్మవద్దని అధికారులు సూచించారు.
News December 25, 2025
ఖమ్మంలో విషాదం నింపిన ఘటనలు

ఖమ్మం జిల్లాలో బుధవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని సాగర్ కాలువలో ఈతకు వెళ్లిన అబ్దుల్ సుహాన్, శశాంక్ అనే మిత్రులు కొట్టుకుపోయారు. నాయకన్గూడెంలో మరో విషాదం చోటుచేసుకుంది. పాఠశాలలో ఆడుకుంటూ కిందపడగా జేబులోని పెన్సిల్ ఛాతికి గుచ్చుకుని విహార్ అనే చిన్నారి మృతి చెందాడు.


