News February 21, 2025
ఖమ్మం మార్కెట్కు పోటెత్తిన మిర్చి

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు గురువారం మిర్చి పోటెత్తింది. దాదాపు 90 వేల బస్తాల మిర్చి మార్కెట్కు వచ్చింది. క్వింటాకు రూ.14,050 ధర పలికింది. ధర తగ్గుముఖం పట్టడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. హమాలీలు దిగుమతి పేరుతో బస్తాకు రూ. 5 నుంచి రూ. 7, కాంటా వేసినందుకు బస్తకు మరో రూ. 3 , కమీషన్ దార్లు కటింగ్ పేరుతో ఇంకో రూ. 3 నుంచి రూ. 5 వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News February 22, 2025
తల్లాడ ఘోర రోడ్డు ప్రమాదం.. ఆప్డేట్

తల్లాడ మండలం రంగంబంజరలో<< 15531420>> రోడ్డు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. పెనుబల్లి మండలం ముత్తగూడెంకి చెందిన నాగిరెడ్డి టీవీఎస్పై తల్లాడ మం.నారాయణపురంలో తన అక్కను చూసేందుకు వచ్చాడు. తిరిగి వెళ్తుండగా రంగంబంజర వద్ద వెనక నుంచి కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగిరెడ్డి టైర్ల కిందపడి మృతి చెందాడు. కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SHO వెంకటేశ్వర్లు తెలిపారు.
News February 22, 2025
శ్రీచైతన్యలో ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. కారణమిదే..!

ఖమ్మం శ్రీచైతన్యలో ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఎటపాకకు చెందిన యోగా నందిని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. సంక్రాంతి సెలవులకు వెళ్లి చాలా రోజుల తరువాత వచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం క్లాస్లకు వెళ్లిన నందిని ఆరోగ్యం బాగలేదని మధ్యలోనే హస్టల్కి వెళ్లింది. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో హస్టల్ సిబ్బంది వెళ్లి చూడగా బలవన్మరణానికి పాల్పడింది.
News February 22, 2025
యువకుడిపై కత్తితో ట్రాన్స్జెండర్ దాడి

రామగుండంకు చెందిన బాధితుడు బాదావత్ మోహన్ కొన్ని నెలల నుంచి ఖమ్మం పెద్దతండాలో చికెన్ షాప్లో పనిచేస్తున్నాడు. ఇక్కడ ట్రాన్స్జెండర్తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. రాత్రి ఇరువురు మధ్య ఘర్షణ ఏర్పడటంతో కోపోద్రిక్తంలో ట్రాన్స్ జెండర్, మోహన్ను కత్తితో ఐదు చోట్ల పొడిచింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ట్రాన్స్జెండర్ పరారీలో ఉంది.